1955లో ఏర్పడిన గజపతినగరం నియోజకవర్గంలో గజపతినగరం , బొండపల్లి, గంట్యాడ, దత్తిరాజేరు, జామి మండలాలున్నాయి. రాజకీయ ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాంతంలో కాపు , క్షత్రియ, కొప్పల వెలమ సామాజిక వర్గాలదే ఆధిపత్యం. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, టీడీపీ 5 సార్లు, స్వతంత్రులు రెండు సార్లు, ప్రజా సోషలిస్ట్ పార్టీ , స్వతంత్ర పార్టీ, జనతా పార్టీ, వైసీపీలు ఒక్కొక్కసారి విజయం సాధించాయి. గజపతుల కోటలో మరోసారి జెండా ఎగురవేయాలని సీఎం వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్యకు మరోసారి అవకాశం కల్పించారు. టీడీపీ అభ్యర్ధిగా కొండపల్లి శ్రీనివాస్కు టికెట్ కేటాయించారు చంద్రబాబు .
Andhra Pradesh Mar 28, 2024, 8:25 PM IST
బొత్స అంటే చీపురుపల్లి.. చీపురుపల్లి అంటే బొత్స అన్నంతగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నియోజకవర్గంలో తూర్పు కాపు సామాజికవర్గానిదే ఆధిపత్యం. చీపురుపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 1983లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి 1999 వరకు పసుపు జెండాకు ఎదురులేకుండా పోయింది. టీడీపీ ఆరు సార్లు, కాంగ్రెస్ 4 సార్లు, ఇండిపెండెంట్లు 2 సార్లు, వైసీపీ , ప్రజా సోషలిస్ట్ పార్టీ, స్వతంత్ర పార్టీలు ఒక్కోసారి చొప్పున విజయం సాధించాయి. బొత్సను ఓడించడమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. బొత్స సత్యనారాయణపై గంటా శ్రీనివాసరావును బరిలో దించాలని ఆయన వ్యూహం రచిస్తున్నారు.
Andhra Pradesh Mar 28, 2024, 7:03 PM IST
చారిత్రకంగా, సాంస్కృతికంగా బొబ్బిలి తెలుగువారికి ఎంతో ప్రత్యేకం. పౌరుషానికి, సాహసానికి, త్యాగానికి బొబ్బిలి యుద్ధం ప్రతీక. తమిళనాడులోని తంజావూరు తర్వాత బొబ్బిలి వీణలకు అంతటి ప్రాధాన్యత వుంది. బొబ్బిలి నియోజకవర్గం తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఆ పార్టీ ఇక్కడి నుంచి 8 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ రెండు సార్లు, ఇతరులు రెండు సార్లు విజయం సాధించారు. బొబ్బిలి రాజవంశీకులదే ఈ నియోజకవర్గంలో ఆధిపత్యం. తొలి నుంచి నేటి వరకు వారే ఎక్కువగా గెలుస్తూ వస్తున్నారు. బొబ్బిలి కోటపై మరోసారి వైసీపీ జెండా ఎగురవేయాలని సీఎం జగన్ కృతనిశ్చయంతో వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చిన అప్పలనాయుడుకు మరోసారి టికెట్ కేటాయించారు. ఈసారి బొబ్బిలి సంస్థాన వారసుడు బేబినాయనకు టీడీపీ టికెట్ కేటాయించింది.
Andhra Pradesh Mar 28, 2024, 5:42 PM IST
సాలూరు నియోజకవర్గం పరిధిలో సాలూరు, పాచిపెంట, మెంటాడ,మక్కువ మండలాలున్నాయి. గిరిజన ఓటర్లతో వుండే ఈ సెగ్మెంట్.. ఎస్టీ రిజర్వ్డ్. గిరిజన, కాపు, కొప్పుల వెలమ, దళితులతో పాటు నాగవంశం కులాలు అభ్యర్ధుల గెలుపొటములను ప్రభావితం చేస్తున్నాయి. సాలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ పార్టీ ఐదు సార్లు, కాంగ్రెస్ మూడు సార్లు, స్వతంత్రులు, వైసీపీ రెండేసి సార్లు, కృషికార్ లోక్ పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, సీపీఐలు ఒక్కోసారి సాలూరులో విజయం సాధించాయి. రాజన్న దొర 2009 నుంచి 2019 వరకు వరుసగా గెలిచి హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. సాలూరుపై పట్టు కోల్పోకూడదని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో వున్నారు. బలమైన నేత , ప్రస్తుత డిప్యూటీ సీఎం రాజన్న దొరకు మరోసారి టికెట్ కేటాయించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా గుమ్మడి సంధ్యారాణిని ప్రకటించారు.
Andhra Pradesh Mar 28, 2024, 4:34 PM IST
కురుపాం రాజవంశీకులు పార్వతీపురంపై ప్రభావం చూపుతున్నారు. ఎన్నికల్లో రాజులు ఎవరికి మద్ధతు ఇస్తే వారిదే విజయం. క్షత్రియులతో పాటు బీసీ, ఎస్సీ ఓటు బ్యాంక్ అధికం. అన్నింటికి మించి కొప్పల వెలమలు అభ్యర్ధుల గెలుపొటములను శాసిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీలు ఐదేసి సార్లు.. ఇండిపెండెంట్లు రెండు సార్లు, స్వతంత్ర పార్టీ, జనతా పార్టీ, వైసీపీలు ఒక్కోసారి విజయం సాధించాయి. పార్వతీపురంలో 2019 నాటి రిజల్ట్ను అందుకోవాలని జగన్ పట్టుదలతో వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జోగారావుకే ఆయన టికెట్ కేటాయించారు. టీడీపీ అభ్యర్ధిగా బోనెల విజయ్ చంద్రకు అవకాశం కల్పించారు చంద్రబాబు.
Andhra Pradesh Mar 28, 2024, 3:28 PM IST
నాగూరు నియోజకవర్గాన్ని 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పేరు మార్చి కురుపాంగా మార్చారు. శత్రుచర్ల విజయరామరాజు కుటుంబానిదే ఇక్కడ ఆధిపత్యం. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా , ఆయన సోదరుడు శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు, అనంతరం ఆయన కోడలు పాముల పుష్పశ్రీవాణిలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2009లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కురుపాంలో మూడు సార్లు ఎన్నికలు జరగ్గా.. 2009లో కాంగ్రెస్, 2014, 2019లలో వైసీపీలు విజయం సాధించాయి. కురుపాంలో హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో వున్నారు. మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణికి మరోసారి టికెట్ కేటాయించారు. తొయ్యపు జగదేశ్వరిని టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించారు చంద్రబాబు.
Andhra Pradesh Mar 27, 2024, 10:00 PM IST
కుప్పం అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే కుప్పం అన్నంతగా ఆయన ప్రజల్లో చెరగని ముద్రవేశారు. కుప్పం నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు, స్వతంత్రులు రెండు సార్లు, సీపీఐ ఒకసారి విజయం సాధించాయి. 1989లో చంద్రబాబు నాయుడు ఎంట్రీ తర్వాతి నుంచి కుప్పం ఆయనకు అడ్డాగా మారింది. వరుసగా 7 సార్లు చంద్రబాబు గెలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల నుంచి చంద్రబాబు కోటకు బీటలు వారడం మొదలైందని విశ్లేషకులు అంటున్నారు. కుప్పం నియోజకవర్గంపై గతంలో చంద్రబాబుకు ప్రత్యర్ధులుగా వున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ఫోకస్ చేయలేదు. జగన్ మాత్రం వై నాట్ కుప్పం అంటూ ప్రత్యేక నినాదం అందుకున్నారు. చంద్రబాబుకు చిరకాల ప్రత్యర్ధిగా వున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
Andhra Pradesh Mar 27, 2024, 8:31 PM IST
చెన్నై, బెంగళూరు నగరాలకు సమీపంలో వుండటంతో వాణిజ్యపరంగా, భౌగోళికంగా పలమనేరుకు ప్రాధాన్యత ఏర్పడింది. చింతపండు, వేరుశెనగ పంటలకు పలమనేరు కేంద్రం. ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 1983లో తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత నుంచి నేటి వరకు పలమనేరులో ఆ పార్టీ 6 సార్లు విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 5 సార్లు, వైసీపీ 2 సార్లు, స్వతంత్ర పార్టీ ఒకసారి గెలిచాయి. పలమనేరులో హ్యాట్రిక్ సాధించాలని సీఎం వైఎస్ జగన్ కృత నిశ్చయంతో వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్ వెంకటే గౌడకు టికెట్ కేటాయించారు. అమర్నాథ్ రెడ్డికి మరోసారి టికెట్ కేటాయించారు చంద్రబాబు
Andhra Pradesh Mar 27, 2024, 7:13 PM IST
2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా గతంలో వున్న వేపంజరి, పుత్తూరు నియోజకవర్గాలు రద్దయి వాటి స్థానంలో పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఎస్సీలకు రిజర్వ్ చేయబడిన పూతలపట్టులో మొత్తం ఓటర్ల సంఖ్య 2,21,038 మంది. 2009లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి మూడు సార్లు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ ఒకసారి, వైసీపీ రెండు సార్లు విజయం సాధించింది. పూతలపట్టులో హ్యాట్రిక్ విజయం సాధించాలని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు బదులుగా మాజీ ఎమ్మెల్యే ఎం సునీల్ కుమార్కు జగన్ టికెట్ కేటాయించారు. సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కలికిరి మురళీమోహన్ను అభ్యర్ధిగా ప్రకటించారు.
Andhra Pradesh Mar 27, 2024, 6:08 PM IST
వైఎస్ షర్మిల ఉన్నట్టుండి మౌనముద్ర దాల్చారు. ఎన్నికలు సమీపిస్తున్నా ఆమె అస్త్రసన్యాసం ఎందుకు చేశారా? అనే ఆసక్తి నెలకొంది.
Andhra Pradesh Mar 27, 2024, 5:51 PM IST
పేరుకు రాయలసీమలో భాగంగా వున్నప్పటికీ ప్రశాంతతకు చిత్తూరు నగరం మారు పేరు. 1952లో ఏర్పడిన చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. హస్తం పార్టీ 8 సార్లు, టీడీపీ మూడు సార్లు, జనతా పార్టీ, కృషికార్ లోక్ పార్టీ, స్వతంత్ర పార్టీ , వైసీపీ, ఇండిపెండెంట్ ఒక్కోసారి చొప్పున విజయం సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చిత్తూరు, గుడిపాల మండలాలకే ఈ నియోజకవర్గం పరిమితమైంది. చిత్తూరు అంటే సీకే బాబు.. సీకే బాబు అంటే చిత్తూరు అన్నంతగా బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సంస్కృతులు చిత్తూరు నగరంలో కనిపిస్తాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసులకు టికెట్ దక్కదని తేలడంతో ఆయన జనసేనలో చేరారు. దీంతో ఎంసీ విజయేంద్ర రెడ్డిని వైసీపీ అభ్యర్ధిగా ప్రకటించారు జగన్. టీడీపీ అభ్యర్ధిగా గురజాల జగన్ మోహన్ను ప్రకటించారు.
Andhra Pradesh Mar 27, 2024, 4:46 PM IST
గంగాధర నెల్లూరుకు రాజకీయంగా ఎంతో ప్రత్యేకత వుంది. గంగాధర నెల్లూరు పేరు చెప్పగానే దివంగత నేత కుతూహలమ్మ గుర్తొస్తారు. జెడ్పీ ఛైర్పర్సన్, ఎమ్మెల్యే, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా ఆమె పనిచేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి 2009 నుంచి నేటి వరకు 3 సార్లు ఎన్నికలు జరగ్గా.. 2009లో కాంగ్రెస్ తరపున కుతుహలమ్మ.. 2014, 2019లలో వైపీపీ నేత నారాయణ స్వామి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. గంగాధర నెల్లూరులో హ్యాట్రిక్ విజయం సాధించాలని సీఎం వైఎస్ జగన్ పట్టుదలగా వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి టికెట్ ఇవ్వొద్దని కొందరు హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన కుమార్తె కృపాలక్ష్మీకి టికెట్ కేటాయించారు . డాక్టర్ వీఎం థామస్ను టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించింది.
Andhra Pradesh Mar 27, 2024, 3:32 PM IST
నగరి అంటే రోజా.. రోజా అంటే నగరి అన్నంతగా చెరగని ముద్ర వేశారు. సినీనటిగా తన గ్లామర్కు తోడు, వైసీపీ ఫైర్ బ్రాండ్గా ప్రత్యర్ధులపై పదునైన విమర్శలు చేస్తూ దూసుకుపోతున్నారు రోజా. కాంగ్రెస్ 7 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ రెండు సార్లు, స్వతంత్రులు ఒకసారి నగరిలో విజయం సాధించారు. పుత్తూరులో ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన గాలి ముద్దుకృష్ణమనాయుడు నగరిలో ఆరో విజయం అందుకున్నారు. అలాగే నగరిలో కాంగ్రెస్ నేత రెడ్డివారి చెంగారెడ్డి ఐదు సార్లు గెలిచారు. నగరిలో వైసీపీ జైత్రయాత్రను కొనసాగించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అయితే రోజాకు స్థానిక నేతల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భాను ప్రకాష్ను అభ్యర్ధిగా ప్రకటించారు చంద్రబాబు.
Andhra Pradesh Mar 26, 2024, 9:48 PM IST
దక్షిణకాశీగా పేరొందిన శ్రీకాళహస్తి రాజకీయంగానూ హీట్ పుట్టిస్తోంది. 2019 ముందు వరకు శ్రీకాళహస్తిలో టీడీపీ , కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా తలపడేవి. కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, టీడీపీ 7 సార్లు, వైసీపీ ఒకసారి, స్వతంత్రులు రెండు సార్లు విజయం సాధించారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇక్కడి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగానూ సేవలందించారు. రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే ఎక్కువగా గెలుస్తూ వస్తున్నారు. శ్రీకాళహస్తిపై పట్టు కోల్పోకూడదని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. దీనిలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి టికెట్ కేటాయించారు. బొజ్జల కుమారుడు సుధీర్ రెడ్డికే టికెట్ కేటాయించారు చంద్రబాబు.
Andhra Pradesh Mar 26, 2024, 7:11 PM IST
హేమాహేమీలను దేశానికి అందించిన ఘనత చంద్రగిరిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అత్యధిక కాలం సీఎంగా, ప్రతిపక్షనేతగా సేవలందించిన చంద్రబాబు నాయుడు స్వగ్రామం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోనే వుంది. పారిశ్రామిక, రాజకీయ రంగాల్లో ప్రత్యేకత చాటుకున్న గల్లా కుటుంబం కూడా చంద్రగిరి నుంచే కార్యకలాపాలు సాగించింది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరిని కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు. 2014, 2019లలో ఆయన వరుస విజయాలు సాధించారు. చెవిరెడ్డికి బదులు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి జగన్ టికెట్ కేటాయించారు. చెవిరెడ్డి కుటుంబానికి చెక్ పెట్టాలని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. టీడీపీ అభ్యర్ధిగా పులివర్తి నానికి టికెట్ కేటాయించారు.
Andhra Pradesh Mar 26, 2024, 5:09 PM IST