పోలవరం పర్యటకు వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు, మంత్రి లోకేష్ గురువారం పోలవరం పర్యటకు వెళ్లారు. అసెంబ్లీ సమావేశాలకు నాలుగు రోజులు సెలవలు కావడంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను పరిశీలించడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. వారితో మంత్రులు కూడా వెళ్లారు. కాగా.. లోకేష్ తన కాన్వాయిలో పోలవరం పర్యటకు వెళ్తుండగా.. ఓ అంబులెన్స్ వెనుక నుంచి వచ్చింది. దీంతో లోకేష్.. తన కాన్వాయిని స్లో చేయించి అంబులెన్స్ కి దారి ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Add Asianetnews Telugu as a Preferred Source

