ముఖ్యమంత్రి చే శంకుస్థాపన

ఆంధ్ర ప్రదేశ్ లో నిర్మించదలచిన టీడీపీ జాతీయ కార్యాలయం శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు అయింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ నెల 26న ఉదయం 5.17 గంటలకు ఖరారు శంకుస్థానం చేస్తారు. 

ఈ మేరకు టీడీపీ కార్యాలయ కార్యదర్శి ఏ.వి.రమణ ఓ ప్రకటనను విడుదల చేశారు. 

మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద తెలుగు జాతీయ కార్యాలయం నిర్మించాలనుకుంటున్నారు.

పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భవన నిర్మానానికి శంకుస్థాపన చేస్తారు.

మొత్తం నాలుగు బ్లాక్‌లుగా పార్టీ నూతన కార్యాలయ నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే పార్టీ ఆఫీస్‌ డిజైన్‌ను సీఎం చంద్రబాబు ఆమోదించారని ఏ.వి.రమణ వెల్లడించారు.