జల్లికట్టుపై ఆందోళన చేస్తున్నది రౌడీలా..
- సంచలన వ్యాఖ్యలు చేసిన సుబ్రహ్మణ్యస్వామి
జల్లికట్టు నిషేధం పై తమిళనాడు అంతా ఏకమైంది. రాజకీయ నేతల నుంచి సినీ తారల వరకు శత్రుత్వం విడిచిపెట్టి ఒక్క మాట మీద నిలబడ్డారు. మెరినా బీచ్ జనసంద్రమైంది జల్లికట్టు పై నిషేధం తొలగించాలని హోరెత్తింది.
దేశమంతా జల్లికట్టుపై తమిళప్రజలు వినిపించిన నిరసన గళం, చేసిన ఆందోళనలు చూసి ఆశ్చర్యపోతుంటే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మాత్రం తనదైన స్టైల్ లో దీనిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
జల్లికట్టుపై నిషేధం తొలగించాలని తమిళనాడులో ఆందోళన చేస్తున్నవారంతా రౌడీలనీ ట్విటర్ లో పోస్ట్ చేశారు.
http://newsable.asianetnews.tv/video/jallikattu-protesters-porukkis