నోట్ల రద్దు ఆర్ బీ ఐ కి ఎప్పుడు తెలుసంటే...
ఆర్ బీ ఐ ఆమోదంతోనే కేంద్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నల్లధనం నిర్మూలనకు పెద్ద నోట్లను రద్దు చేస్తూ నవంబర్ 8 న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే కేంద్ర కేబినెట్ తో చర్చించకుండా కనీసం ఆర్ బీ ఐ ని కూడా సంప్రదించకుండా మోదీ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
అయితే పెద్ద నోట్ల రద్దు ప్రకటనపై కేంద్రం ఆర్ బీ ఐ కి ముందే సూచించిందట.
నోట్ల రద్దుపై ఒక రోజు ముందే కేంద్ర ప్రభుత్వం ఆర్ బీ ఐ కి సమాచారం అందజేసినట్లు పార్లమెంటరీ కమిటీకి ఆర్బీఐ అందజేసిన నివేదికలో పేర్కొనడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
దొంగనోట్లు, ఉగ్రవాదులకు నిధులు, నల్లధనం సమస్యలను అడ్డుకునేందుకు నోట్లను రద్దు చేయాల్సిందిగా ఆర్బీఐకి కేంద్రం సలహా ఇచ్చింది. దీనికి ఆర్బీఐ సెంట్రల్ బోర్డు వెంటనే ఆమోదం తెలిపింది.