Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా నదిలో మరో పడవ బోల్తా

  • కృష్ణా నదిలో మరో పడవ బోల్తా
  • సీఎం చంద్రబాబు నివాసానికి సమీపంలో బోల్తా పడిన పడవ
one more boat accident in krishna river

 కృష్ణా నదిలో మరో పడవ బోల్తా పడింది. నాలుగు రోజుల క్రితం ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద పడవ బోల్తా పడి 21 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందో మరో పడవ బోల్తా పడింది.  వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నదిలోని ఇసుకను పడవలోకి నింపి తీసుకొస్తుండగా పడవ ఒక్కసారిగా తిరగబడి బోల్తా కొట్టింది. పరిమితికి మించి ఇసుకను నింపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఆ సమయంలో పడవలో ఉన్న కార్మికులు కిందకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి సమీపంలోనే ఈ పడవ బోల్తా పడటం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios