పార్లమెంట్ లో అస్వస్థతకు గురైన ఎంపీ
ఒడిశా ఎంపీ ఏవీ స్వామి పార్లమెంట్ లో అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఆయన పార్లమెంట్ ఆవరణలో కుప్పకూలిపోయారు. ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభలో ప్రకటించారు. అస్వస్థతకు గురైన కేవీ స్వామిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Add Asianetnews Telugu as a Preferred Source


అస్వస్థతకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఏవీ స్వామి.. స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభలో కొనసాగుతున్నారు. ఒకవైపు ఉభయ సభల్లో టీడీపీ, వైసీపీ ఎంపీలు.. స్పెషల్ స్టేటస్ కోసం ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
