చంద్రబాబు నాయుడికి మద్దతుగా అచ్చనాయుడు, రామ్మోహనాయుడు దీక్ష (వీడియో)
చంద్రబాబు నాయుడికి మద్దతుగా అచ్చనాయుడు, రామ్మోహనాయుడు దీక్ష (వీడియో)
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ధర్మ పోరాట దీక్ష " కు మద్దతుగా ఈ రోజు శ్రీకాకుళం 7 రోడ్స్ జంక్షను లో దీక్ష చేస్త్తున్న మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు, పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహనాయుడు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలో హామీలు అమలు విషయంలో కేంద్రం మొండి వైఖరి విడనాడాలని లేనియెడల ఈ దీక్షలో మరింత ఉధృతం చేస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోరాటం చేస్తారని ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యురాలు గుండా లక్ష్మీదేవి ,జడ్ పి ఛైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మి గ,జిల్లా టీడీపీ అధ్యక్షులు గౌతు శిరీష , నగర టీడీపీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ , జిల్లా మరియు నగర టీడీపీ క్యాడర్ పాల్గోన్నారు.