జగన్ పాదయాత్ర రెండో రోజు షెడ్యూల్ ఇదే...
- వైసీపీ అధినేత జగన్.. ప్రజా సంకల్ప యాత్ర సోమవారం మొదలైంది.
- ఇడుపుల పాయలో మొదలైన ఈ యాత్ర ఇప్పటికే 5కిలోమీటర్ల మేర సాగింది.
వైసీపీ అధినేత జగన్.. ప్రజా సంకల్ప యాత్ర సోమవారం మొదలైంది. ఇడుపుల పాయలో మొదలైన ఈ యాత్ర ఇప్పటికే 5కిలోమీటర్ల మేర సాగింది. కాగా..ప్రజా సంకల్ప యాత్ర రెండో రోజు షెడ్యూల్ను జగన్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
ఆయన మంగళవారం పులివెందుల, కమలాపురం నియోజక వర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు. ఇడుపులపాయ-వేంపల్లి రోడ్డు మీదుగా రెండో రోజు యాత్ర సాగనుంది. రెండో రోజు మొత్తం 12.6 కిలో మీటర్లు సాగే పాదయాత్ర నీలతిమ్మాయపల్లి సమీపంలో ముగుస్తుంది.
Sharing schedule of Day 2 of #PrajaSankalpaYatra pic.twitter.com/4Kc0fzQjW0
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 6, 2017
కాగా, తొలి రోజు వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళి అర్పించిన వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ..ఉదయం 9 గంటల 47 నిమిషాలకు తొలి అడుగు వేశారు. ఇడుపుల పాయలో నిర్వహించిన బహిరంగ సభకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు వేలది సంఖ్యలో తరలి వచ్చారు.