పసిడి ధరకు బ్రేక్.. పరుగుపెడుతున్న వెండి
10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.235 తగ్గి రూ.29 వేలకు దిగువకు చేరుకుంది.
బంగారం, వెండి ధరలు ఒకేసారి తగ్గడం, పెరగడం ఇన్నాళ్లు గమనించాం. అయితే ఈసారి చిన్న మార్పు పసిడి ధర తగ్గుముఖం పడుతోంటే వెండి ధర మాత్రం పెరుగుతోంది.
మంగళవారం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.235 తగ్గి రూ.29 వేలకు దిగువకు చేరుకుంది.
అంతర్జాతీయంగా గడ్డు పరిస్థితులు ఉండటం, జూయోలరీ షాపుల యజమానుల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో బంగారం ధరకు బ్రేక్ పడినట్లు బులియన్ వర్గాలు తెలిపాయి.
ఇలా బంగారం ధర తగ్గుతుంటే వెండి ధర మాత్రం కాస్త పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.315 పెరిగి రూ.39,815 కు చేరుకుంది.