రాష్ట్ర విభజన అవమాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఈ అవమానాన్ని దిగమింగుకుని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ఆయన జూన్ రెండో తేదీన రాష్ట్ర ప్రజలందరి చేత ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. జూన్ 8న ఆయన మహాసంకల్పం దీక్ష  చేయిస్తారు. ఈ సందర్భంగా ఆయన  బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

విభజన అవమానం దిగుమింగుకోవాలి...ముఖ్యమంత్రి బాబు పిలుపు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

విభజన అవమానాన్ని దిగమింగుకోండి, కసిని, కోపాన్ని రాష్ట్రాభివృద్ధిపై చూపించండి ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.

జూన్ 2 ఉదయం పది గంటల సమయానికి రాష్ట్రంలో ప్రతి ఒకరూ నవనిర్మాణ దీక్ష – ప్రతిజ్ఞ చేయాలని అన్నారు.

ఇలాగే జూన్ 8 సాయంత్రం 5 గంటలకు మహాసంకల్పం తీసుకోవాలని కూడా ఆయన ఈ రోజు అధికారులతో జరిగిన సమావేశంలో చెప్పారు.

నవనిర్మాణ దీక్ష వారం రోజులు ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఈ శని, ఆదివారాలు ప్రభుత్వ యంత్రాంగం తప్పనిసరిగా విధుల్లో పాల్గొనాలని కూడా ఆయన చెప్పారు. అధికారులు వినూత్నంగా ఆలోచించాలని, ప్రేరణగా పని చేయాలని మూస ధోరణిలో పాలన సాగిస్తే ప్రగతి వుండదని ఆయన చెప్పారు. జూన్ 8 కల్లా రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్ లేని ఇల్లు వుండకూడదని నిర్దేశించారు. జిల్లాలు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ మంత్రికి, నవ నిర్మాణ దీక్ష సమన్వయ బాధ్యతలను ఆయన అప్పగించారు.