ఈ సారి మిస్ వరల్డ్ పోటీలకు చాలా ప్రత్యేకత ఉంది. మూడో సారి ఇండియాలో, తొలిసారి హైదరాబాద్ లో జరిగిన ఈపోటీలో ఇండియా నుంచి పోటీ చేసిన నందిని గుప్తా టైటిల్ గెలిచుంటే ఇండియా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసేంది. కాని  ఆ రికార్డ్ ను ఇండియా మిస్ అయ్యింది.

మిస్ వరల్డ్ పోటీలకు మూడు సార్లు ఆతిథ్యం ఇచ్చిన ఇండియా

మిస్ వరల్డ్ పోటీలకు ఇండియా మూడు సార్లు ఆతిథ్యం ఇచ్చింది. 1951లో లండన్ లో పోటీలు ప్రారంభం కాగా 1996లో 46వ ఎడిషన్ పోటీలు మన దేశంలోని బెంగళూరులో జరిగాయి. ఆ తర్వాత 71వ ఎడిషన్ ముంబయిలో, 72వ ఎడిషన్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు మూడు సార్లు ఆతిధ్యం ఇచ్చిన మనదేశం రికార్డు స్థాయిలో 6 సార్లు మిస్ వరల్డ్ కిరీటాన్ని గెల్చుకుంది. ప్రస్తుతం జరుగుతున్న పోటీలో కనుక ఇండియా కప్ గెలిచి ఉంటే.. ఏడు సార్లు మిస్ వరల్డ్ సాధించిన ఏకైక దేశంగా ఇండియా నిలిచేది. కాని ఇండియా ఆశలు గల్లంతు అయ్యాయి. పోటీలో నిలిచిన నందినీ గుప్తం టాప్ 20 తో సరిపెట్టుకోవలసి వచ్చింది.

నిరాశ పరిచిన నందిని గుప్తా

మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ 20లోకి దూసుకుపోయారు. ఆసియా - ఓషియానా ఖండం నుంచి నందిని గుప్తా టాప్ 5 విజేతగా నిలిచారు. ఆసియా- ఓషియానా నుంచి ముందుగా ఆస్ట్రేలియాకి చెందిన జస్మినే స్ట్రింగర్ టాప్ 20లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఇండియా నుంచి నందిని గుప్తా పేరు ప్రకటించడంతో అక్కడ ప్రేక్షకుల నుంచి కేరింతలు మొదలయ్యాయి. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ అతిథులు కూడా నందిని గుప్తా టాప్ 20లో స్థానం దక్కించుకోవడంతో చప్పట్లతో అభినందించారు. కానీ టాప్ 8లో ఇండియాకి నిరాశ తప్పలేదు. ఆసియా- ఓషియానా నుంచి టాప్ 2గా ఫిలిప్పీన్స్, థాయిలాండ్ దేశాల అందగత్తెలు విజేతలుగా నిలిచి టాప్ 8లోకి ఎంట్రీ ఇచ్చారు. టాప్ 8లో ఖండానికి ఇద్దరేసి చొప్పున ఎంపిక చేస్తారు. దీనితో నందిని గుప్తాకి నిరాశ తప్పలేదు. మొత్తంగా మిస్ వరల్డ్ 2025లో నందిని గుప్తా ప్రయాణం ముగిసింది.

మిస్ వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ తారలు ఎవరంటే?

ఇండియా ఇప్పటి వరకు ఆరు సార్లు ప్రపంచ సుందరి కిరీటాన్ని గెల్చుకుంది. 1966లో మన దేశం నుండి మిస్ వరల్డ్ కిరీటాన్ని రీటా ఫారియా తొలి సారి గెల్చుకున్నారు. ఆ తర్వాత 1994లో ఐశ్వర్యా రాయ్, 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తా ముఖి, 2000 లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లార్ మన దేశం తరపున మిస్ వరల్డ్ కిరీటాన్ని సాధించి జయకేతనం ఎగురవేశారు. మన దేశం లాగానే వెనిజులా కూడా ఆరు సార్లుఈ టైటిల్ గెల్చుకుంది.

 

ఈ పోటీల్లో పోటీ పడే అందాల భామలు తమ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఇలా మన దేశం ఆరు సార్లు, వెనిజులా ఆరు సార్లు ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్నాయి. అయితే ఈ సారి మన దేశం తరపున పోటీలో నిలిచిన నందిని గుప్తా.. 2023లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరిటాన్ని గెల్చుకున్నారు. మిస్ ఇండియా 2025 లో మాత్రం టాప్ 20 వరకు చేరుకున్నారు. ఈమె రాజస్థాన్ లోని కోటాకు చెందిన 21 ఏళ్ల యువతి. బిజినెస్ మేనేజ్మెంట్ లో డిగ్రీ చేశారు. ఈ దఫా నందినీ గుప్తా ఈ పోటీల్లో విజేతగా నిలిస్తే ప్రపంచ రికార్డ్ అయ్యేది. కాని ఆమె ఓడిపోవడంతో భారత్ ఆశలు నెరవేరలేదు.

నందిని గుప్తా ఓటమికి కారణాలు

మిస్ వరల్డ్ 2025 లో ఇండియా నుంచి పోటీలో నిలిచిన నందిని గుప్తా ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా పోటీలో దూసుకుపోయిన థాయిలాండ్, ఫిలిప్పీన్స్ మోడల్స్ కంటే నందినీ గుప్తాలో కాన్ఫిడెంట్ లెవల్స్ చాలా తక్కువగా కనిపించాయి. ప్రధానంగా జరిగే 5 పోటీలలో ఆమె ఒక్క దానిలో మాత్రమే తన సత్తా చాటగలిగింది. ఇక ప్రస్తుతం ఈ పోటీల్లో గెలిచిన థాయిలాండ్ మోడల్ ఓపల్‌ సుచాత కంటే బెటర్ పెర్ఫామెన్స్ ఇవ్వడంతో నందిని గుప్తా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ఆసియా నుంచే పోటీలో ఉన్న కొంత మంది భామలు చేసిన ఎమోషనల్ స్పీచ్ లు జడ్జ్ లను ఆకట్టుకున్నాయి. ఆడిమన్స్ ను వారి పెర్పామెన్స్ తో మెస్మరైజ్ చేయగలిగారు. ఇక రైతు కుటుంబ నుంచి వచ్చిన నందినీ గుప్త తన గురించి కూడా సరిగ్గా చెప్పుకోలేక పోయారని తెలుస్తోంది.  ఇక నందిని గుప్తా కాస్ట్యూమ్స్ విషయంలో కూడా పోటీకి తగ్గ జాగ్రత్తలు పాటించలేదన్న విమర్శ ఉంది. ఈ పోటీల్లో నందిని గుప్తా తడబడ్డారన్న అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేశారు. ఇలా నందిని గుప్త ఓటమికి అనేక కారణాలు అక్కడ కనిపిస్తున్నాయి.