అదానీ షెల్ కంపెనీల్లో ఉన్న రూ.20 వేల కోట్ల పెట్టుబడులు ఎవరివి అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కాంగ్రెస్ న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తెస్తోందనే వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. 

కాంగ్రెస్ పార్టీ న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెస్తోందన్న భారతీయ జనతా పార్టీ ఆరోపణలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తోసిపుచ్చారు. గౌతమ్ అదానీ వ్యవహారంపై కేంద్రంపై నిప్పులు చెరిగిన ఆయన గౌతమ్ అదానీ డొల్ల కంపెనీల్లో రూ.20,000 కోట్లు ఎవరు పెట్టుబడులు పెట్టారని, ఆ డబ్బు ఎవరిదని ప్రశ్నించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల తదుపరి జాబితాను నిర్ణయించడానికి ఆయన ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యాలయానికి మంగళవారం మీడియాతో మాట్లాడారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రామనవమి ఊరేగింపులో తుపాకీతో యువకుడి హల్చల్.. వీడియో వైరల్.. కట్ చేస్తే..

ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న తర్వాత మీడియా ఆయనను చుట్టుముట్టింది. కాంగ్రెస్ న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెస్తోందనే బీజేపీ ఆరోపణలపై రాహుల్ గాంధీని జర్నలిస్టులు ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానం ఇస్తూ.. ‘‘బీజేపీ ఏమంటుందో మీరు ఎప్పుడూ ఎందుకు చెబుతారు ? ఎందుకు పదే పదే అదే చెబుతారు. విషయం చాలా సింపుల్. అదానీ డొల్ల కంపెనీల్లో ఉన్న రూ.20 వేల కోట్లు ఎవరికి చెందినవి? వీళ్లు బినామీలు, మరి డబ్బులెవరివి ?’’ అని ఆయన ప్రశ్నించారు. 

Scroll to load tweet…

కాగా.. ‘మోడీ ఇంటిపేరు’ వ్యాఖ్యలపై క్రిమినల్ పరువు నష్టం కేసులో మార్చి 23న తనకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పలువురు పార్టీ సీనియర్ నేతలు సోమవారం గుజరాత్ కోర్టును ఆశ్రయించారు. ఆయన వెంట ఆయన సోదరి, పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. ఆమెతో పాటు రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా కోర్టుకు వచ్చారు. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ దాఖలు చేసిన అప్పీల్ ముగిసే వరకు గుజరాత్ లోని సూరత్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

2019 ఏప్రిల్ లో కర్ణాటకలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ చేసిన ‘మోడీ ఇంటి పేరు ’ వ్యాఖ్యలపై ఆయనపై పరువునష్టం కేసు దాఖలైంది. ‘‘దొంగలందరికీ మోడీని ఉమ్మడి ఇంటి పేరుగా ఎలా కలిగి ఉంటారు?’’ అని ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే 2013లో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఏ ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా దోషిగా తేలితే ఆటోమేటిగ్గా అనర్హత వేటు పడుతుంది. తాజా పరువు నష్టం కేసులో దోషిగా తేలిన రాహుల్ గాంధీ మార్చి 24వ తేదీన తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. 

దేశంలో 13 కోట్ల మోడీలు ఉన్నారు.. వారందరికీ ఫిర్యాదు చేసే హక్కు ఉండదు - బెయిల్ పిటిషన్ లో రాహుల్ గాంధీ

ఇదిలా ఉండగా.. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి రాహుల్ గాంధీతో పాటు పార్టీ నేతలు డీకే శివకుమార్, వీరప్ప మొయిలీ, రణదీప్ సూర్జేవాలా, డీకే సురేశ్, ప్రియాంక్ ఖర్గే, మోహసీనా కిద్వాయ్ చేరుకున్నారు. కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనుండగా.. మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.