దేశభక్తి శక్తులను ఏకం చేసేందుకు భారత్ జోడో యాత్రలో పాల్గొంటాం - సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా
కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపడుతున్న భారత్ జోడో యాత్రలో తాము పాల్గొంటామని సీపీఐ నేత డి.రాజా ప్రకటించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన లేఖలో స్పష్టం చేశారు.
జనవరి 30న శ్రీనగర్లో జరిగే భారత్ జోడో యాత్ర (బీజేవై) చివరి విడతలో చేరుతామని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి రాజా మంగళవారం తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆహ్వానాన్ని మన్నిస్తూ రాజా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు. రాజా భారత్ జోడో యాత్ర సామరస్యం, సమానత్వం సందేశాలను ప్రశంసించారు. గణతంత్రాన్ని తిరిగి పొందేందుకు, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు లౌకిక, ప్రజాస్వామ్య, దేశభక్తి అన్ని శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు.
వృద్ధుడిని బైక్ తో ఢీకొట్టాడని.. దళిత యువకుడిని కొట్టి చంపారు.. యూపీలో దారుణం..
“మనం బ్రిటిష్ రాజ్తో ఐక్యంగా పోరాడాము. అలాగే మనం కలిసికట్టుగా వచ్చి ఆర్ఎస్ఎస్-బీజేపీ రాజ్ను ఐక్యంగా ఓడించాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని లేఖలో పేర్కొన్నారు. జనవరి 30న శ్రీనగర్లో జరిగే యాత్ర ముగింపు వేదికపై తాను, సీపీఐ పార్లమెంటరీ పార్టీ నాయకుడు బినోయ్ విశ్వం పాల్గొంటారని రాజా తెలిపారు.
భారత్ జోడో యాత్రను అభినందిస్తూ విద్వేషాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉండాలన్న పిలుపు స్వాగతించదగినదని రాజా అన్నారు. ‘‘మహాత్మా గాంధీ, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్, షహీద్ బగత్ సింగ్ కలలుగన్న గణతంత్ర రాజ్యాన్ని తిరిగి పొందేందుకు, రాజ్యాంగ విలువలను పరిరక్షించడానికి, సమ్మిళిత భారతదేశం కోసం పోరాడటానికి లౌకిక ప్రజాస్వామ్య, దేశభక్తి అన్ని ఛాయలు ఏకం కావడం అత్యవసరం. దేశంలో ఐక్యత కోసం మహాత్మాగాంధీ తన ప్రాణాలను అర్పించారు, ఆయన బలిదానం 'మనం', 'వారు' అనే విభజనలను తొలగించి, మెరుగైన భారతదేశాన్ని రూపొందించడానికి కలిసి రావడానికి మనకు స్ఫూర్తినిస్తుంది” అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
క్రైం బ్రాంచ్ నుంచి సస్పెండైన కానిస్టేబుల్ చేసిన క్రైంకి... పోలీసులకే దిమ్మతిరిగింది..
బీజేపీ, ఆరెస్సెస్ లపై విరుచుకుపడిన రాజా ‘‘మన రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, న్యాయం, లౌకికవాదం, సోషలిజం వంటి విలువలు మన ప్రజాస్వామ్య గణతంత్రానికి పునాది. తరతరాలుగా స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న భారతదేశం అనే భావనకు ఆరెస్సెస్-బీజేపీ విరుద్ధంగా నిలుస్తున్నాయి. సమసమాజ, సహనశీల, సమ్మిళిత భారతదేశం కోసం వారు తమ వద్ద ఉన్నదంతా త్యాగం చేశారు. ఆ ఊహాశక్తిని వక్రీకరించేందుకు ఆరెస్సెస్-బీజేపీ ప్రయత్నిస్తున్నాయి’’ అని తన లేఖలో ఆరోపించారు.
భారత్ జోడో యాత్ర ముగింపు దశలో పాల్గొనాలని 21 భావసారూప్యత కలిగిన పార్టీల అధినేతలను జనవరి 10వ తేదీన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆహ్వానించారు. అందులో భాగంగానే పలు పార్టీలు భారత్ జోడో యాత్రలో చేరుతున్నాయి. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర పంజాబ్ లో కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలోని పఠాన్కోట్లో జనవరి 19తో ఈ యాత్ర ముగియనుంది. ఆ తరువాత భారత్ జోడో యాత్ర తన చివరి గమ్యస్థానమైన జమ్మూ కాశ్మీర్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ మహాత్మా గాంధీ హత్య వార్షికోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేయనున్నారు.
ఢిల్లీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు ఉండకూడదు.. మీ వాదన ప్రమాదకరం - కేంద్రంతో సుప్రీం కోర్టు...
తమిళనాడులోని కన్యాకుమారిలో సెప్టెంబర్ 7న ఈ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్ర జనవరి 30వ తేదీన శ్రీనగర్లో ముగుస్తుంది. ఇప్పటి వరకు ఈ యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో తిరిగి వచ్చింది.