వైరల్ వీడియో : ఖర్గే మాట్లాడుతుంటే పడీ పడీ నవ్విన మోడీ..
కాంగ్రెస్ అధికార ప్రతినిధి మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతుంటే.. ప్రధాని నరేంద్రమోదీ బాగా ఎంజాయ్ చేశారు. నవ్వులతో రాజ్యసభ దద్దరిల్లింది. ఇంతకీ ఏం జరిగింది.
![Viral video : Modi laughed a lot while talking Congress chief Mallikarjun Kharge in Rajya Sabha - bsb Viral video : Modi laughed a lot while talking Congress chief Mallikarjun Kharge in Rajya Sabha - bsb](https://static-ai.asianetnews.com/images/01hnmwzrt3cm4mjqyngjy7wqy0/whatsapp-image-2024-02-02-at-17-57-09_363x203xt.jpg)
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల కోసం అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను నిర్దేశిస్తున్నందున, రాబోయే 2024 లోక్సభ ఎన్నికలపై రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. బీజేపీ లక్ష్యాలపై కామెంట్ చేశారు. ఆ సమయంలో సభలోనే ఉన్న మోడీ ఆ మాటలు వింటూ గట్టిగా నవ్వేశారు. ఈ ఘటన శుక్రవారం రాజ్యసభలో జరిగింది. ఖర్గే మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, "మీకు 330-334 సీట్ల మెజారిటీ ఉంది. ఈసారి అది '400 చేరుకుంటుంది'" అని అన్నారు. అది విన్న ప్రధాని నరేంద్ర మోడీ పడీ పడీ నవ్వు నవ్వేశారు.
బీజేపీ అధికారిక X హ్యాండిల్ ఈ వీడియోను షేర్ చేసింది. వెంటనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి క్యాప్షన్... ""నాకు కొత్త పగవారు కావాలి.. పాతవాళ్లంత నా అభిమానులుగా మారిపోయారు’ అన్నట్టుగా మోడీ చూస్తున్నారు’.. అని రాసుకొచ్చారు. ఈ వీడియోను నెటిజన్లు "అబ్కీ బార్, 400 పార్" అని విపరీతంగా షేర్ చేశారు.
ట్రక్కు డ్రైవర్లకు మోడీ శుభవార్త .. త్వరలో హైవేలపై 1000 విశ్రాంతి కేంద్రాలు , ఫుల్ ఫెసిలిటీస్తో
2019 ఎన్నికల్లో 303 సీట్లు సాధించిన బీజేపీ.. ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో మరిన్ని సీట్లు కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి, పార్టీ ఇప్పటికే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ప్రభుత్వ విజయాలను నొక్కి చెప్పే థీమ్ సాంగ్ను ప్రారంభించింది. “సప్నే నహీ హకీకత్ బంతే హై, తభీ తో సబ్ మోదీ కో చున్ తే హై” అంటే.. ‘కలలు కాదు నిజాలు సాకారం అవుతాయి.. అందుకే కదా అందరూ మోదీని ఎంచుకుంటారు’ అంటూ ఈ పాట సాగుతుంది. ఈ పాటను పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా జనవరి 26న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఆవిష్కరించారు.
గత దశాబ్ద కాలంగా దేశంలో వచ్చిన పరివర్తనాత్మక మార్పులను ప్రతిబింబిస్తూ ప్రధాని మోదీ ఇలా వ్యాఖ్యానించారు, "10-12 సంవత్సరాల క్రితం దేశంలో నెలకొన్న పరిస్థితులు భవిష్యత్తును అంధకారానికి గురిచేశాయి. ఆ కాలంలోని పరిస్థితుల గురించి మీకు కూడా తెలియకపోవచ్చు. . 2014కి ముందు తరం ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అవకాశాల గురించి ఆశలు వదులుకుంది."
ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర ప్రారంభోత్సవం వంటి ముఖ్యమైన మైలురాళ్లతో, బీజేపీ, ప్రధాని మోడీకి మూడవసారి అధికారం దక్కించుకోనే అవకాశాన్ని.. లోక్సభలో తన ఆధిపత్యాన్ని బలోపేతం చేస్తుందని ఆశాజనకంగా ఉంది. 2019 ఎన్నికలకు ముందు, ఎన్డిఎ పరిపాలనకు మద్దతును కూడగట్టడానికి బిజెపి ‘ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ [మరోసారి మోడీ ప్రభుత్వం]’ అనే నినాదాన్ని రూపొందించింది.
2023లో నాయకత్వ శిఖరాగ్ర సమావేశంలో, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఎన్డిఎ అవకాశాలపై విశ్వాసం వ్యక్తం చేశారు, రాబోయే ఎన్నికల్లో 400 సీట్లకు పైగా భారీ విజయం సాధిస్తారని అంచనా వేశారు. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లోని మొత్తం 80 లోక్సభ స్థానాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని కూడా గోయల్ అంచనా వేశారు.
దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. 2024 లోక్సభ ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. 400 సీట్ల మార్కును అధిగమించాలనే బిజెపి లక్ష్యం దాని పరివర్తన ఎజెండాను కొనసాగించడానికి, దేశ ప్రజల నుండి మరోసారి ఆమోదాన్ని పొందాలనే సంకల్పాన్ని నొక్కి చెబుతుంది.