వికాస్ భారత్ సంకల్ప యాత్రకు జన నీరాజనాలు.. దేశవ్యాప్త పర్యటన గురించి తెలుసా?
వికాస్ భారత్ సంకల్ప యాత్ర. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా జరగనున్న యాత్ర. కొండ ప్రాంతాల నుంచి మైదానాల వరకు, పట్టణాల నుంచి మారుమూల పల్లెటూరుల వరకు ఈ యాత్ర సాగుతున్నది. ప్రభుత్వ పథకాల గురించి అధికారులు సాధారణ ప్రజలకు ఈ యాత్రలో భాగంగా విడమర్చి చెబుతున్నారు.
![vikas bharat sankalp yatra receiving tremendous publc support which was launched by pm narendra modi in november kms vikas bharat sankalp yatra receiving tremendous publc support which was launched by pm narendra modi in november kms](https://static-ai.asianetnews.com/images/01hh2m68xjrm3a9dt1dgr0arx9/Vikas-Bharat-Sankalp-Yatra-1701969077170_363x203xt.jpg)
Vikas Bharat Sankalp Yatra: వికాస్ భారత్ సంకల్ప యాత్ర కొండ ప్రాంతాల నుంచి మైదానాల వరకూ, పట్టణాల నుంచి దేశంలోని మారుమూల పల్లెల వరకు సాగుతున్నది. ప్రతి గ్రామానికి ఈ యాత్ర చేరుతున్నది. ప్రజలు పూల వర్షంతో ఈ యాత్రను స్వాగతిస్తున్నాయి. నవంబర్ 15వ తేదీన ఈ యాత్రను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.
న్యూ ఇండియా జంక్షన్ అనే యూట్యూబ్ చానెల్ ఈ వికాస్ భారత్ సంకల్ప యాత్ర గురించి ఓ వీడియోను పోస్టు చేసింది. గ్రామాల్లోకి ఈ యాత్ర ప్రవేశించడాన్ని, అధికారుల ద్వారా ప్రభుత్వ పథకానలు ప్రజలకు వివరిస్తున్న విధానాన్ని ఈ వీడియో చూపించింది.
ఈ యాత్ర దేని గురించి?
భారత నలముూలల వరకు చేపడుతున్న ఒక అవగాహన యాత్రే ఈ వికాస్ భారత సంకల్ప యాత్ర. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 15వ తేదీన జార్ఖండ్లోని ఖైంటీ జిల్లాలో ఈ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర వచ్చే ఏడాది జనవరి 25వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతల్లో అన్ని గ్రామ పంచాయతీలు, సుమారు 3,700 పట్టణ ప్రాంతాల్లో ఈ యాత్ర సాగుతుంది.
Also Read: IPL Auction: రచిన్ రవీంద్ర కోసం ‘హైదరాబాద్’ భారీగా పెట్టొచ్చు: ఇర్ఫాన్ పఠాన్
ఈ యాత్ర ద్వారా ప్రజలు తమకు రావాల్సిన, తాము లబ్దిదారులమయ్యే ప్రభుత్వ పథకాల గురించి వారిలో అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం. తద్వార అర్హతలు ఉండి కూడా అలాంటి ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉండకుండా చేస్తుంది. ఈ యాత్ర, కేంద్ర, ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సహాయంతో ఈ యాత్ర సాగుతున్నది.