Asianet News TeluguAsianet News Telugu

పాడైన లిఫ్ట్‌లోకి ఎక్కి ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తి.. పై అంతస్తుల నుంచి నేరుగా గ్రౌండ్ ఫ్లోర్‌కు వచ్చిపడి..

ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో ఓ వ్యక్తి పాడైన లిఫ్ట్ ఎక్కి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ లిఫ్ట్‌లో సాంకేతిక సమస్యలు ఉన్నాయి. కానీ, ఆ లిఫ్ట్ పని చేయడంలేదనే బోర్డులేవీ పెట్టలేదు. దీంతో ఆ వ్యక్తి లిఫ్ట్ ఎక్కాడు. క్షణాల్లో పలు ఫ్లోర్‌లను దాటేసి ఒక్కపెట్టున గ్రౌండ్ ఫ్లోర్‌కు వచ్చి పడింది.
 

Uttar pradesh man dies after he stepped into out of order lift at mall kms
Author
First Published May 27, 2023, 5:35 PM IST

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్ జిల్లాలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పాడైపోయిన లిఫ్ట్ ఎక్కాడు. అతను ముట్టుకోగానే డోర్ తెరుచుకోవడంతో అందులోకి ఎక్కాడు. అంతే.. ఆ తర్వాత వెంటనే తటాలున ఆ లిఫ్ట్ పై అంతస్తుల నుంచి కిందకు వచ్చి పడింది. అందులోని వ్యక్తి మరణించాడు. సహరన్‌పూర్‌లోని ఓ మాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ లిఫ్ట్ పాడైపోయిందని యాజమాన్యానికి తెలుసు అని, కానీ, నిర్లక్ష్యపూరిత వైఖరితో కనీసం హెచ్చరిక బోర్డులనూ అక్కడ ఏర్పాటు చేయలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

స్పాట్‌కు చేరుకున్న పోలీసులు ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు.

మృతి చెందిన వ్యక్తిని రాంపూర్ ఏరియాలో నివసించే అమనర్ కుమార్‌గా గుర్తించారు. సహరన్‌పూర్‌లో సదర్ బజార్ ఏరియాలోని జీఎన్‌జీ మాల్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షులు ఈ ఘటనతో హతాశయులయ్యారు. ఆ లిఫ్ట్‌లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని తెలిపారు. అమన్ కుమార్ టచ్ చేయగానే డోర్ ఓపెన్ అయిందనీ వివరించారు. వెంటనే ఆ లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్‌లోకి వచ్చి పడిందని తెలిపారు.

Also Read: కర్ణాటక క్యాబినెట్ విస్తరణ.. సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ మంత్రిత్వ శాఖలపై ఉత్కంఠ.. హోం శాఖ ఆయనకేనా?

నిర్లక్ష్యం వహించిన ఆ మాల్ యాజమాన్యపై యాక్షన్ తీసుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. ఆ ఏరియా మొత్తం ఈ ఘటనతో ఖంగుతిన్నట్టయింది.

Follow Us:
Download App:
  • android
  • ios