Asianet News TeluguAsianet News Telugu

మీరట్‌లో టెర్రర్ ఆపరేషన్: ఖలిస్తాన్ టెర్రరిస్ట్ అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాంటెడ్ ఉగ్రవాది కోసం ఆపరేషన్ చేపట్టింది. మీరట్‌లో పంజాబ్ పోలీసులతో కలిసి, యూపీకి చెందిన ఏటీఎస్ పోలీసులు దాడులు జరిపారు. 

uttar pradesh ats and punjab police arrest wanted terrorist in joint operation
Author
Meerut, First Published May 31, 2020, 2:30 PM IST

ఉత్తరప్రదేశ్‌లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాంటెడ్ ఉగ్రవాది కోసం ఆపరేషన్ చేపట్టింది. మీరట్‌లో పంజాబ్ పోలీసులతో కలిసి, యూపీకి చెందిన ఏటీఎస్ పోలీసులు దాడులు జరిపారు.

Also Read:మహిళల ఫోటోలు మార్ఫింగ్ చేసి లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్: యువకుడి అరెస్ట్

ఈ ఘటనలో ఖలిస్థాన్ మూమెంట్‌కు సంబంధించి లింకులు ఉన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది తీరత్ సింగ్‌ను  అరెస్ట్ చేశారు. ఇతను ఖలిస్తాన్ మూవ్‌మెంట్‌కు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఈ విషయాన్ని యూపీ పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. కాగా, గతంలో మీరట్‌లో ఉగ్రకదలికలు అప్పట్లో కలకలం సృష్టించాయి.

Also Read:ఉరుములతో కూడిన జడివాన: దెబ్బతిన్న తాజ్ మహల్

ఈ ప్రాంతంలో ప్రేరేపిత ఉగ్రవాదుల కోసం గతంలో జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు జరిపింది. ఐఎస్ మాడ్యుల్స్‌ కూడా ఈ ప్రాంతంలో ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి కూడా. తాజాగా ఖలిస్థాన్‌కు సంబంధించిన లింకులు కూడా ఇక్కడే బయటపడటంతో కలకలం రేపుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios