ఆకస్మిక తనిఖీలో తుపాకీ లోడ్ చేయలేకపోయిన యూపీ పోలీసు.. వీడియో వైరల్..యోగి సర్కార్ పై సమాజ్ వాదీ పార్టీ విమర్శలు
యూపీ పోలీసుల అసమర్థంగా ఉన్నారంటూ ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ యోగి సర్కార్ పై విమర్శలు గుప్పించింది. ఓ పోలీసు స్టేషన్ ను ఐజీ ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు అందులో ఉన్న ఎస్ఐ తుపాకీని లోడ్ చేయలేకపోయాడు. ఈ వీడియో వైరల్ కావడంతో సమాజ్ వాదీ పార్టీ ఇలా స్పందించింది.
యూపీలోని ఓ పోలీసు స్టేషన్ ను ఉన్నతాధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి పోలీసులు తుపాకీలను లోడ్ చేయలేకపోయారు. ఇది యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మధురై ఎయిర్పోర్ట్లో కరోనా కలవరం.. చైనా నుంచి తిరిగివచ్చిన తల్లీకూతుళ్లకు పాజిటివ్గా నిర్దారణ..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఉన్న పలు పోలీసు స్టేషన్ లను ఇటీవల బస్తీ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) ఆర్ కే భరద్వాజ్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన ఆ జిల్లాలో ఉన్న ఖలీలాబాద్ పోలీస్ స్టేషన్ను కూడా సందర్శించారు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న పోలీసుల సామర్థ్యాలను ఆయన పరీక్షించారు. ఈ సందర్భంగా ఓ ఎస్ఐ ను రైఫిల్ లోడ్ చేయాలని ఆయన సూచించారు.
రాజకీయ దుమారం రేపిన సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలు.. అయినా క్షమాపణ చెప్పబోనని స్పష్టీకరణ
కానీ ఆ ఎస్ ఐ దానిని లోడ్ చేయలేకపోయాడు. బుల్లెట్లను గొట్టం ద్వారా వేసేందుకు ప్రయత్నించాడు. గన్ ను సరిగా పట్టుకోలేకపోయాడు. దీంతో ఐజీ నివ్వెరబోయారు. అక్కడే అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకరు తమ సెల్ ఫోన్ లో రికార్డు చేశారు. అది సోషల్ మీడియా వరకు ఎలా చేరిందో తెలియదు గానీ.. ఒక్క సారిగా వైరల్ అయ్యింది. ‘వావ్ యూపీ పోలీసులు’ అంటూ ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వైరల్ అయిన ఈ వీడియో ఉత్తరప్రదేశ్ లోని ప్రతిపక్ష పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ వద్దకు చేరింది. దీంతో ఆ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఆ వీడియోను సమాజ్ వాదీ పార్టీ ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ఉత్తరప్రదేశ్ పోలీసుల అసమర్థతపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది.
మెస్ ఫుడ్ విషయంలో వాగ్వాదం.. జైలు వార్డెన్ ను చితకబాదిన తోటి పోలీసులు.. అరెస్ట్...
“యోగి జీ.. పోలీసులకు తుపాకీ ఎలా ఎక్కించాలో కూడా తెలియదు! తుపాకీ బారెల్లోంచి బుల్లెట్ని చొప్పించిన యుపీ పోలీసులు అజ్ఞానానికి పరాకాష్ట. పేద, అమాయక ప్రజలను వేధిస్తున్న బీజేపీ ప్రభుత్వ క్రమశిక్షణ లేని పోలీసు ఎస్ఐకి తుపాకీ ఎలా ఉపయోగించాలో కూడా తెలియదు. ఇది చాలా అవమానకరం. అలాంటి పోలీసులు పోలీసు శక్తిని మెరుగుపరుస్తారా?’’ అని పేర్కొంటూ సమాజ్వాదీ పార్టీ హిందీలో ట్వీట్ చేసింది.