Asianet News TeluguAsianet News Telugu

Ayushman Arogya Mandir :ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ల పేరు మార్చిన కేంద్రం.. కొత్త పేరు ఏంటంటే

ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లు (Ayushman Bharat-Health and Wellness Centres) పలు మార్పులకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Union Health Ministry) శ్రీకారం చుట్టుంది. అందులో భాగంగా ఆ సెంటర్ల పేరు మార్చింది. ఇక నుంచి వాటిని 'ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్' (Ayushman Arogya Mandir)గా పిలవాలని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది. 

Union Health Ministry has renamed Ayushman Bharat Health and Wellness Centers as Ayushman Arogya Mandir..ISR
Author
First Published Nov 27, 2023, 9:38 AM IST

దేశవ్యాప్తంగా ఉన్న ఆయుష్మాన్ భారత్-హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ల (Ayushman Bharat-Health and Wellness Centres)కు కేంద్ర ప్రభుత్వం పేరు మార్చింది. వాటికి 'ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్' (Ayushman Arogya Mandir)గా నామకరణం చేశారు. ఈ ఏడాది చివరి నాటికి రీబ్రాండింగ్ ప్రక్రియను అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా లేఖ రాసింది.

Hyderabad Accident : హైదరాబాద్ శివారులో ఆర్టిసి బస్సు బోల్తా... 20 మందికి గాయాలు

ఆయుష్మాన్ భారత్-హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ (ఏబీ-హెచ్ డబ్ల్యూసీ) పోర్టల్లో రీబ్రాండెడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఫోటోలను అప్లోడ్ చేయాలని మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను కోరింది. రీబ్రాండెడ్ సెంటర్లలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం ) లోగోను ఉంచాలని స్పష్టం చేసింది. రీబ్రాండెడ్ ఏబీ-హెచ్ డబ్ల్యూసీలకు 'ఆరోగ్య పరమం ధనం' అనే కొత్త ట్యాగ్ లైన్ కు కూడా ఉండనుంది. 

Rahul Gandhi : ధరణి పేరుతో ప్రజల భూములను లాక్కున్నారు - బీఆర్ఎస్ పై రాహుల్ గాంధీ విమర్శలు..

రెండు రోజుల కిందట రాష్ట్రాలకు రాసిన లేఖలో ‘‘అనారోగ్యం నుండి ఆరోగ్యానికి ఆలోచన, ఆరోగ్య సంరక్షణ పంపిణీని తీసుకెళ్లడంలో ఈ కేంద్రాలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఆయుష్మాన్ ఇండియా కలను సాకారం చేసేందుకు ఆయుష్మాన్ భారత్-హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లకు 'ఆరోగ్య పరమం ధనం' అనే ట్యాగ్ లైన్ తో 'ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్'గా నామకరణం చేయాలని నిర్ణయించాం’’ అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

రాహుల్ గాంధీకి ఉద్యోగమంటే ఏంటో తెలుసా ? కర్ణాటకలో ఒక్క జాబ్ నోటిఫికేషనైనా ఇచ్చారా ?- మంత్రి కేటీఆర్

ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను మార్చడానికి అవసరమైన నిధులను ఒక్కో సౌకర్యానికి రూ.3,000 చొప్పున ప్రతిపాదించారు. రీబ్రాండింగ్ పూర్తయిన తర్వాత రాష్ట్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కొత్త ఫొటోలను కొత్త పేరుతో ఏబీ-హెచ్ డబ్ల్యూసీ పోర్టల్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ యోజన కింద గత ఐదేళ్లలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.6 లక్షలకు పైగా ఏబీ- హెచ్ డబ్ల్యూసీలను విజయవంతంగా ఏర్పాటు చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios