ఓ మహిళా కార్మికులు అనుకోకుండా యాసిడ్ ను తాగేసింది. దీంతో వెంటనే కడుపులో, నోటిలో విపరీతమైన మంట మొదలైంది. దీంతో అక్కడున్న సిబ్బంది ఆమెను హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది.
ఆమె ఓ కార్మికురాలు. బాటిళ్లను శుభ్రం చేసే ఫ్యాక్టరీలో పని చేస్తోంది. అయితే పని చేస్తున్న సమయంలో ఆమెకు దాహం వేసింది. దీంతో తన తోటి కార్మికురాలని నీళ్లు ఇవ్వాలని కోరింది. ఆమె చూసుకోకుండా యాసిడ్ బాటిల్ ఇచ్చింది. దానిని మంచి నీళ్లు అని భావించి తాగేసింది. దీంతో ఒక్క సారిగా నోటిలో విపరీతమైన మంట మొదలైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి. ఖర్గోన్ జిల్లాలో రింకూ ఠాక్రే అనే కార్మికులు నివసిస్తోంది. ఆమె తన జీవనోపాధి కోసం అదే జిల్లాలో ఉన్న బాటిళ్లను శుభ్రం చేసే ఫ్యాక్టరీలో పని చేసేది. ఎప్పటిలాగే శనివారం కూడా ఫ్యాక్టరీకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమెకు దాహంగా అనిపించింది. దీంతో తన పక్కన పని చేస్తున్న ఓ మహిళను తాగేందుకు నీళ్లు ఇవ్వాలని కోరింది.
కానీ పని ధ్యాసలో ఉన్న ఆమె సరిగా చూసుకోకుండా రింకూకు ఓ సీసా ఇచ్చింది. దానిని మామూలు మంచి నీళ్లే అనుకొని తాగేసింది. కానీ అందులో యాసిడ్ ఉందని గమనించలేదు. దీంతో ఒక్క సారిగా కడుపులో, నోట్లో మంట మంట మొదలు అయ్యింది. ఫ్యాక్టరీ సిబ్బంది, తోటి కార్మికులు వెంటనే ఆమెను సమీపంలోని ఓ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు ఆమెకు ట్రీట్ మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.