సంచిని ఎత్తుకెళ్తున్న కుక్క.. దానిని ఆపి సంచిని తెరిచి చూడటంతో షాక్... అందులో ఏముందంటే ?
రాజస్థాన్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఎనిమిది నెలల చిన్నారి మృతదేహాన్ని ఓ కుక్క ఈడ్చుకెళ్లింది. ఓ రైతు దానిని గమనించి కుక్కను తరిమివేశాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు.
అతడో రైతు. ఎప్పటిలాగే పొలానికి వెళ్లి నీళ్లు పెడుతున్నాడు. అయితే అదే సమయంలో పక్క నుంచి ఓ కుక్క పరిగెడుతోంది. దాని నోట్లో ఓ సంచి ఉంది. దీంతో రైతుకు అనుమానం వచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్లి కుక్కను ఆపాడు. దానిని హడలెత్తించడంతో సంచి అక్కడే వదిలేసి కుక్క పారిపోయింది. అయితే రైతు ఆ సంచిని తెరిచి చూశాడు. వెంటనే షాక్ అయ్యాడు. ఆ సంచిలో 8 నెలల పసికందు మృతదేహం కనిపించింది. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశాడు.
20 మంది పిల్లలపై కామంతో కీచక ఉపాధ్యాయుడి అఘాయిత్యం.. తరగతి గదిలోనే జుగుప్సాకరంగా..!
రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సేద్వా గ్రామానికి చెందిన రైతు హనుమంతరామ్ శుక్రవారం ఉదయం సమయంలో తన పొలంలో పని చేస్తున్నాడు. ఇదే సమయంలో ఓ చిన్నారి మృతదేహం ఉన్న సంచిని ఓ కుక్క దాని నోటితో పట్టుకెళ్తోంది. ఆ రైతు ఆ కుక్కను ఆపేసి, చిన్నారి మృతదేహాన్ని దాని నుంచి రక్షించాడు. ఈ సమచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చిన్నారి డెడ్ బాడీని స్థానికంగా ఉండే హాస్పిటల్ కు తలించి పోస్టుమార్టం నిర్వహించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణ ప్రారంభించారు. అయితే ఆడపిల్ల జన్మించింది అనే కారణంతో తల్లిదండ్రులు చిన్నారిని విడిచిపెట్టి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
గంటల వ్యవధిలో కవల సోదరులు మృతి.. ఒకే చితిపై అంత్యక్రియలు.. రాజస్థాన్ లో విషాదం..
రాజస్థాన్లోని ఇదే బార్మర్లో జిల్లాలో ఒక్క రోజు వ్యవధి కూడా లేని పసికందును ఎవరో ముళ్ల పొదల్లో పడేశారు. ఆ పసి కూన రాత్రంతా చలిలోనే ఉండిపోయింది. నలుగురు స్నేహితులు మార్నింగ్ వాక్ కోసం బయటకు ఈ పసికందు ఏడుపు గమనించారు. పాపను రక్షించి హాస్పిటల్ లో చేర్పించారు. చికిత్స అందిచడంతో బాలిక ఆరోగ్యం మెరుగుపడింది. ఈ ఘటన ఐదు రోజుల కిందట వెలుగులోకి వచ్చింది.
బలోత్రా పట్టణానికి చెందిన మంగీలాల్, ప్రకాష్ కుమార్, రాజు, ముఖేష్ అనే నలుగురు స్నేహితులు మార్నింగ్ వాక్ చేసి ఇంటికి తిరిగి వస్తున్నారు. పొదల్లో బాలిక ఏడుపు శబ్దం వినిపించడంతో ముఖేష్ ఆ చుట్టుపక్కల వెతికారు. ఎంతో సేపు గాలించిన తరువాత వారందరికీ ఆ చిన్నారి కవర్ లో చుట్టి ఉన్నట్టు కనిపించింది. వెంటనే ఆ బాలికను శాలువాలోకి తీసుకొని, పోలీసులకు సమాచారం అందించి, హాస్పిటల్ కు తరలించారు. అధిక ఉష్ణోగ్రతలు లేకపోవడంతో శిశువుకు ప్రమాదం జరగలేదని డాక్టర్లు తెలిపారు. ఆ ప్రాంతంలో కుక్కలు, పందులు అధికంగా సంచరిస్తూ ఉంటాయి. కానీ ఆ పాపకు ఏం జరగకముందే స్నేహితులు కాపాడారు.