ప్రియురాలి భర్తను చంపి, అతడి ఇంట్లోనే శవాన్ని పాతిపెట్టిన ప్రియుడు.. మద్యం మత్తులో చెప్పేయడంతో..
వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అక్రమ సంబంధం విషయం ప్రియురాలి భర్తకు తెలియడంతో అతడిని ప్రియుడు దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
ఆమెకు వివాహం అయ్యింది. గ్రామంలో ఉండే ఓ వ్యక్తితో ఆమెకు పరిచయం అయ్యింది. అది వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇలా వీరి మధ్య శారీరక సంబంధం కొనసాగుతోంది. తరచూ ప్రియుడు ఇంటికి రావడంతో ఆమె భర్తకు అనుమానం వచ్చింది. దీంతో ప్రియురాలితో తన సంబంధం ఇలాగే కొనసాగాలంటే ఆమె భర్తను చంపాలని అనుకున్నాడు. దీంతో పథకం ప్రకారం అతడిని హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టాడు. పై నుంచి కాంక్రీట్ తో మూసేశాడు. కానీ తాగిన మైకంలో ఒక రోజు ఈ విషయాన్ని వాగేశాడు. దీంతో పోలీసులకు సమాచారం అందింది. శవాన్ని బయటకు తీసి నిందితుడిని అరెస్టు చేశారు.
స్వలింగ సంపర్కులంటే ఒకే.. కానీ స్వలింగ వివాహాలు ఆమోదయోగ్యం కాదు - బీజేపీ ఎంపీ సుశీల్ మోడీ
ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. పానిపట్ డిస్ట్రిక్ట్ సమల్ఖా సిటీలో రవి అనే వ్యక్తి తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన ప్రవీణ్ కు రవి భార్యతో అక్రమ సంబంధం ఏర్పడింది. అయితే ఈ నెల 11వ తేదీ నుంచి రవి కనిపించడం లేదు. ఆ ఊర్లో అందరికీ ప్రవీణ్, రవి భార్యకు మధ్య ఉన్న సంబంధం తెలుసు. కానీ ఎవరికీ ప్రవీణ్ పై అనుమానం కలుగలేదు.
ప్రియుడిని చంపి, డ్రమ్ములో కుక్కి.. అడవిలోకి తీసుకెళ్లి తగలబెట్టి.. ఓ ప్రియురాలి ఘాతుకం..
దీంతో రవి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు అందజేశారు. దీంతో పోలీసులు ఎంక్వేరీ ప్రారంభించారు. కానీ వారికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. రవి ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదు. అయితే ఈ క్రమంలో ప్రవీణ్ ఓ రోజు ఫుల్లుగా మద్యం తాగాడు. తానే రవిని హత్య చేశానని, శవాన్ని అతడి ఇంట్లోనో పాతిపెట్టానని ప్రవీణ్ తన సోదరుడితో వాగేశాడు.
సబ్సిడీ రుణాల పేరుతో టీఆర్ఎస్ మైనార్టీలను అవమానిస్తోంది: కాంగ్రెస్
దీంతో అతడు షాక్ అయ్యాడు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు వెంటనే రవి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో గొయ్యి తవ్వి తీస్తే అందులో శవం కనిపించింది. అది రవిదేనని నిర్ధారించుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. రవికి మత్తు మందు అందించి, బలమైన ఆయుధంతో కొట్టి చంపేశానని నిందితుడు పోలీసులకు తెలిపాడు. అనంతరం కాంక్రీట్ తో ఇంట్లోనే పూడ్చిపెట్టానని అన్నారు. అనంతరం పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.