ప్రియుడిని చంపి, డ్రమ్ములో కుక్కి.. అడవిలోకి తీసుకెళ్లి తగలబెట్టి.. ఓ ప్రియురాలి ఘాతుకం..
అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగివ్వమని వేధిస్తున్నాడని ప్రియుడిని దారుణంగా హతమార్చిందో ప్రియురాలు. ఆ తరువాత శవాన్ని డ్రమ్ములో కుక్కి.. అడవిలోకి తీసుకువెళ్లి కాల్చేసింది.
ఛత్తీస్ గఢ్ : కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి దారుణమైన స్థితిలో శవమై తేలాడు. ఈ ఘటన చత్తీస్ ఘడ్ లోని రాజ్ నంద్ గావ్ లో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రియుడితో డబ్బు విషయంలో గొడవలు రావడంతో.. ప్రియురాలే అత్యంత దారుణంగా హతమార్చింది. ఆ తర్వాత హత్య విషయాన్ని కప్పి పెట్టడానికి మృతదేహాన్ని.. ఓ డ్రమ్ములో కుక్కింది. ఆ తర్వాత అడవిలోకి తీసుకు వెళ్ళింది. అక్కడ మృతదేహాన్ని తలపెట్టింది. అనంతరం ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చేసింది. అయితే, మూడు రోజుల కిందట చంద్ర భూషణ్ అనే వ్యక్తి కనిపించడం లేదని.. అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. ఇదే సమయంలో రెండు రోజుల క్రితం కోట్నా, పానీ అడవుల్లో గుర్తు తెలియని, సగం కాలిన మృతదేహాం కనిపించింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈమేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సగం కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులను పిలిపించి, చూపించగా చంద్ర భూషణ్ గా గుర్తించారు.
ఈ క్రమంలో అనుమానితురాలిగా రాగిణి సాహు అనే మహిళ కనిపించింది. కారణం చంద్రభూషన్, రాగిణి సాహు ప్రేమికులు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. వీరి విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. చంద్రభూషన్, రాగిణి సాహు ప్రేమికులు. వివాహేతర సంబంధం కూడా ఉంది. ఈ క్రమంలో రాగిణికి చంద్ర భూషణ్ కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు.
గడ్డపారతో విద్యార్థిపై టీచర్ దాడి.. నాల్గోతరగతి స్టూడెంట్ మృతి..
అయితే ఈ డబ్బు విషయంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఈ విభేదాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే చంద్రభూషణ్ చాలా సార్లు డబ్బులు ఇవ్వమంటూ.. ప్రియురాలు రాగినిని బ్లాక్ మెయిల్ చేసేవాడు.. వేధింపులకు గురి చేశాడు. దీంతో రాగిని కోపోద్రిక్తురాలయ్యింది. తన స్నేహితుడైన నూతన సాహో సాహూ అనే వ్యక్తితో కలిసి.. చంద్ర భూషణ్ ను హత్య చేయడానికి పథకం పడింది. తాను దొరకకుండా ఉండాలని చంపిన తర్వాత డ్రమ్ములో తీసుకెళ్లి దూరంగా పొలాల్లో కాల్చేసి వచ్చింది.
ఇదిలా ఉండగా, రాజస్థాన్లోని శ్రీగంగానగర్ జిల్లాలో ఆదివారం ఉదయం దారుణ ఘటన వెలుగుచూసింది. పొలాలకు సమీపంలోని ఖాళీ స్థలంలో కాలిపోయిన స్థితిలో ఉన్న ఓ వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 40 ఏళ్ల వ్యక్తి చేతులు, కాళ్లు వైర్తో కట్టివేసినట్లు ఎస్హెచ్ఓ (పురాణి అబాది) సుర్జీత్ కుమార్ తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం..హత్య కేసుగా కనిపిస్తోందని, మృతదేహాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.