Telugu news live updates: నేటి ప్రధాన వార్తలు
సారాంశం
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడు. క్రికెట్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ వార్తలు, సినిమా విశేషాలకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు మీకోసం..
ND vs PAK: సెంచరీ నంబర్ 82... దుబాయ్ లో పాకిస్తాన్ పై కింగ్ కోహ్లీ సింహ గర్జన
ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంచరీతో దుమ్మురేపాడు. పాక్ బౌలింగ్ ను దంచికొడుతూ 82వ సెంచరీతో భారత్ కు విజయాన్ని అందించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
![]()
అజిత్ కారుకు మరో ప్రమాదం
స్టార్ హీరో అజిత్ కారుకు మరోసారి యాక్సిడెంట్ అయ్యింది. స్పేయిన్ దేశంలో జరుగుతున్న రేస్ లోఅజిత్ కారు ప్రమాదానికి గురయినట్టు తెలుస్తోంది. మరి స్టార్ హీరో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేయండి.
చిరంజీవి కొరియోగ్రఫీ చేసిన ఏకైక సినిమా?
మెగాస్టార్ చిరంజీవి మల్టీ టాలెంటెడ్ అని అందరికి తెలుసు. ఆయన డాన్స్ గురించి కూడా అందరికి తెలుసు. కాని ఆయన తన సాంగ్ ను తానే కొరియోగ్రఫీ చేసుకున్నారని మీకు తెలుసా? చిరంజీవి కొరియోగ్రాఫీ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ సాంగ్ ఏదో తెలుసా? ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 స్టార్ట్ అయ్యేది ఎప్పుడో తెలుసా?
తెలుగులో అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కి ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సీజన్ 9ను అంతకు మించి చేయబోతున్నారట. మరి ఈసారి కంటెస్టెంట్స్ ఎవరు..? షో ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆనందం ఎక్కడ దొరుకుతుంది.? చాట్ జీపీటీ, గూగుల్ జెమినీలు చెప్పిన సమాధానాలు ఏంటంటే..
![]()
పేదవాడైనా, కోటీశ్వరుడైనా ప్రతీ ఒక్కరికీ ఉండే కోరిక సంతోషంగా ఉండాలని. భవిష్యత్తులో సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు కష్టపడాలని అనుకుంటారు. అయితే సంతోషానికి నిజమైన అర్థం ఏంటో మాత్రం ఎవ్వరూ చెప్పలేరు. మరి ఇదే ప్రశ్నను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అడిగితే ఏం సమాధానం చెప్తుందో ఎప్పుడైనా ఆలోచించారా.? పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
హోండా యాక్టివా CNG వచ్చేస్తోంది.. ఏకంగా 400 కి.మీలు దూసుకెళ్లొచ్చు.
![]()
పెరిగిన పెట్రోల్ ధరల నేపథ్యంలో వాహనదారులు ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ టూ వీలర్ కంపెనీలు సీఎన్జీ వేరియంట్ ను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. కాగా తాజాగా హోండా యాక్టివా సైతం సీఎన్జీ స్కూటర్ ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
సెన్సార్ లో కట్ చేసిన పిఠాపురం ఎమ్మెల్యే డైలాగ్ ఇదే, ఉండుంటే థియేటర్లు బద్దలయ్యే రెస్పాన్స్
సందీప్ కిషన్ ఓ ఇంటర్వ్యూలో మజాకా చిత్రం గురించి క్రేజీ విషయాన్ని బయట పెట్టారు. ఈ మూవీలో పిఠాపురం ఎమ్మెల్యే అనే డైలాగ్ ఉంది. కానీ సెన్సార్ వాళ్ళు దానిని కట్ చేశారు. ఈ మూవీలో నాకు ఇష్టమైన డైలాగ్ కూడా అదే అని సందీప్ కిషన్ తెలిపాడు. పూర్తి కథనం ఇక్కడ చదవండి.
ఒక్కడు, పోకిరి, మురారి కాదు, కృష్ణంరాజుకి బాగా ఇష్టమైన మహేష్ మూవీ.. రెబల్స్ కి మాత్రమే నచ్చే చిత్రం అది
కృష్ణ కుటుంబంతో కృష్ణంరాజుకు ప్రత్యేక అనుబంధం ఉంది. మహేష్ బాబు గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహేష్ చిత్రాల్లో తనకి ఇష్టమైన మూవీ ఏంటో చెప్పారు. మహేష్ బాబు పోకిరి, మురారి, ఒక్కడు లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. పూర్తి కథనం ఇక్కడ చదవండి.
బాలయ్య చేసిన దరిద్రపు పని సుమన్, చిరంజీవి కూడా చేశారా ? ఆ మూవీస్ లో హీరోయిన్లు వీళ్ళే
నందమూరి బాలకృష్ణ కెరీర్ లో సూపర్ ఫామ్ లో ఉన్నారు. బాలయ్యకి అన్నీ బాగా కలసి వస్తున్నాయి. రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇటీవలే పద్మభూషణ్ అవార్డు కూడా దక్కింది. అఖండ నుంచి బాలయ్యకి వరుసగా సూపర్ హిట్స్ దక్కుతున్నాయి. పూర్తి కథనం ఇక్కడ చదవండి.
Odela2 Teaser Review: తమన్నా `ఓడెల 2` టీజర్ ఎలా ఉందంటే.. థియేటర్లలో ఊగిపోవడమే
`గుడ్ బ్యాడ్ అగ్లీ`లో త్రిష క్యారెక్టర్పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్.. ఆమె ఎలా కనిపిస్తుందంటే?
రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్తో సల్మాన్ ఖాన్, పుకార్లకి బలం.. ఆ డైరెక్టర్ ఆఫీస్లో ఏం పని?
ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకులు ఎవరో తెలుసా? టాప్ 10 లిస్ట్
రేవంత్ రెడ్డికి రాహుల్ ఫోన్
![]()
శ్రీశైలం ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో చిక్కున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందం చర్యలను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డితో ఈ విషయమై ఫోన్లో మాట్లాడగా. తాజాగా కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ.. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి తెలుకున్నారు. బాధితులను రక్షించేందుకు జరుగుతున్న చర్యలపై ఆరా తీశారు. ఇద్దరు నేతలు దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ప్రభుత్వం చేపడుతోన్న చర్యలను రాహుల్కు వివరించారు రేవంత్.
ఓసారి మీ అకౌంట్ చెక్ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్ అయ్యాయో తెలుసా.?
![]()
గత కొన్ని వారాల నుంచి ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ అకౌంట్ నుంచి కొంతమేర డబ్బులు కట్ అవుతున్నాయి. దీంతో ఖాతాదారులు అసలేం జరిగిందంటూ ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఈ డబ్బులు ఎందుకు కట్ అయ్యాయి.? దీని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
టన్నెల్లో బిక్కుబిక్కుమంటూ..
![]()
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్లో బోరింగ్ మెషిన్ (టీబీఎం)తో సొరంగం తవ్వుతుండగా.. పైకప్పు కూలిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో జరిగిన ప్రమాదం నుంచి 46 మంది సిబ్బంది ప్రాణాలతో బయటపడగా 8 మంది కార్మికులు, ఉద్యోగులు చిక్కుకుపోయారు. దీంతో ప్రభుత్వం సహాయక చర్యలను ప్రారంభించింది. రాత్రంతా వారి జాడను వెతికేందుకు ప్రయత్నాలు జరిగాయి. సొరంగంలోకి 8 మీటర్ల మేర చేరిన నీళ్లు, రాళ్లు చేరడంతో సహాయక చర్యల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో సొంరంగంలో ఆ 8 మంది బక్కు బిక్కుమంటున్నారు. మరి ఈరోజైనా వారి జాడ కనిపెడతరా చూడాలి.