Tamannaah Odela 2 Teaser : తమన్నా భాటియా ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్ 2025లో పుణ్య స్నానం చేసింది, తన రాబోయే సినిమా `ఓడెల 2` టీజర్‌ను విడుదల చేసింది. ఈ అనుభవం మర్చిపోలేనిదని, సినిమా నిర్మాతలని పొగిడింది.

Tamannaah Bhatia Odela 2 Teaser : బాలీవుడ్ నటి తమన్నా భాటియా శనివారం, ఫిబ్రవరి 22న ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన పవిత్ర మహాకుంభ్ 2025కి హాజరైంది. గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో మునిగింది. ఈ సమయంలో ఆమె పూజా కార్యక్రమాలు నిర్వహించింది. తమన్నా ఆధ్యాత్మిక భక్తికి అభిమానులు ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో తమన్నా ప్రయాణాన్ని విశ్వాసం, సంస్కృతికి చిహ్నంగా అభివర్ణిస్తున్నారు.

తమన్నా భాటియా భక్తిని పొగుడుతున్నారు

తమన్నా మహాకుంభ్ మేళాలో సంప్రదాయ పద్ధతిలో మునిగింది. గంగా మాత పాదాలకు నమస్కరించింది. ఈ సమయంలో ప్రసాదం స్వీకరించింది. ఆమెతో పాటు ఓ సీనియర్ లేడీ కూడా ఉంది. ఆమె సంగమంలో పూజలు చేసింది. ఆ తర్వాత తమన్నా భాటియా తన రాబోయే తెలుగు సినిమా `ఓడెల 2` టీజర్‌ను విడుదల చేసి ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా చేసింది. అశోక్ తేజ దీనికి దర్శకత్వం వహించారు..సంపత్‌ నంది దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఆయనే రైటర్‌. ఈ సినిమాలో తమన్నా నాగా సాధు శివశక్తిగా కనిపించనుంది. ప్రయాగ్‌రాజ్‌లో టీజర్ విడుదల గురించి మాట్లాడుతూ, మహాకుంభ్ మేళాలో ఉండటం తన జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం అని తమన్నా చెప్పింది.

 

Scroll to load tweet…

 

తమన్నా భాటియా మధు, అశోక్ తేజలను పొగిడింది

తమన్నా మాట్లాడుతూ, "ఓడెల 2 నాకు చాలా ప్రత్యేకమైన సినిమా, ఈ చారిత్రాత్మక ప్రదేశంలో ఉండటం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో భాగం కావడం నా జీవితంలో ఒక గొప్ప అవకాశం. ఈ సినిమా ఒక చిన్న ఆలోచనతో మొదలైందని, కానీ కాలక్రమేణా చాలా పెద్దదైందని ఆమె చెప్పింది. తనపై నమ్మకం ఉంచినందుకు నిర్మాత మధుకు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే నటి అశోక్ తేజను కూడా పొగిడింది.

మరి `ఓడెల 2` టీజర్ ఎలా ఉందంటే థ్రిల్లర్‌, హర్రర్‌ మేళవింపుతో రూపొందించారు. దీనికి దేవుడు, సూపర్‌ పవర్‌ ఎలిమెంట్లని జోడించారు. `ఓడెలా 2` టీజర్‌ చూస్తే, నదిలో నంది, శివలింగం, త్రిశూలం చూపించే సీన్‌తో టీజర్‌ ప్రారంభమైంది. తర్వాత సైకిల్‌కి లైట్‌ రావడం, అది స్ట్రెయిట్‌గా తిరిగి సైకిల్‌ అర్థరాత్రి ఓ ఊరికి పరిగెడుతుంది. అంతలోనే తమన్నా కన్ను తెరిసి సీరియస్‌గా చూస్తుంది. ఓడెల ఊరికి కథ వెళ్తుంది.

అక్కడ నందిని చూపించడం, ఓ వ్యక్తిని నిలువున పూడ్చిపెట్టడం, ఓ చిన్నారి నడుచుకుంటూ రావడం, సాధువులు దరువేయడం, దెయ్యం తిరిగి వస్తే, దేవుడు కూడా తిరిగి వస్తాడు అని చెప్పడంతో తమన్నా సాధువుగా ఎంట్రీ ఇస్తుంది. ఆ ఊర్లో రాత్రి సమయాల్లో హర్రర్‌ ఎలిమెంట్లు చోటు చేసుకుంటాయి. కొందరిని చావబాదుతుంటారు. చెట్టు వద్ద ఈదురుగాలూలు భయానక వాతావరణం క్రియేట్ అవుతుంది. జనం భయాందోళనకు గురవుతుంటారు. ఈ క్రమంలో ప్రత్యర్థులను, దెయ్యాలను ఎదుర్కొనేందుకు తమన్నా ఎంట్రీ ఇవ్వడం గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. టీజర్‌ ఆద్యంతం పూనకాలు తెప్పించేలా ఉంది. సినిమాపై అంచనాలు పెంచుతుంది. త్వరలోనే సినిమా ఆడియెన్స్ ముందుకు రాబోతుందని టీమ్‌ తెలిపింది. 

read  more: సౌందర్య నటించడానికి భయపడ్డ సినిమా ఏంటో తెలుసా? ఆ కష్టం భరించలేక మధ్యలోనే తప్పుకోవాలనుకుందా?

also read: `కార్తికేయ` సినిమాలు `ఖలేజా`కి కాపీ? భార్య మొహం మీదే చెప్పేసిందా?.. నిజాలు బయటపెట్టిన డైరెక్టర్‌