Asianet News TeluguAsianet News Telugu

భార్యపై అనుమానం.. దారుణంగా హత్య చేసి, శరీరాన్ని రెండుగా నరికి అడవిలో పాతిపెట్టిన భర్త..

భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. క్రూరంగా ఆమెను హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా చేశారు. అనంతరం ఆ శరీర భాగాలను అడవిలో పాతి పెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. 

Suspicion on wife.. Husband brutally murdered, cut body in two and buried in forest..
Author
First Published Nov 21, 2022, 9:58 AM IST

సమాజంలో క్రూరత్వం పెరిగిపోతోంది. తోటి మనుషుల పట్ల విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. గత వారం రోజులుగా వెలుగులోకి వస్తున్న ఘటనలు పరిశీలిస్తే ఇదే విషయం అవగతమవుతోంది. ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య దేశం మొత్తం సంచలనం సృష్టించింది. అలాంటి ఘటనే ఆదివారం మరొకటి ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. మాజీ ప్రేయసిని ఓ యువకుడు హత్య చేసి ఎనిమిది ముక్కలుగా చేసి బావిలో విసిరేశాడు. తాజాగా అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లోనూ జరిగింది. భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేసి శరీరాన్ని రెండు ముక్కలుగా చేశాడు. అనంతరం మృతదేహాన్ని అడవిలో పాతి పెట్టాడు. 

ప్రేమను నిరాకరించిందని, మత్తు ఇచ్చి బలవంతంగా పెళ్లి.. ఒప్పుకోలేదని స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం..

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం షాడోల్ కు చెందిన రామ్‌కిషోర్‌ పటేల్‌, సరస్వతి దంపతులు. వారిద్దరికి కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. అయితే కొంత కాలం నుంచి అతడు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆమెను హత్య చేయాలని భావించాడు. ఆమెను దారుణంగా నరికి చంపేశాడు.

బీహార్ లో ట్రక్కు బీభత్సం, చిన్నారులతో సహా.. 12మంది మృతి.. రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మోదీ..

అనంతరం ముక్కలుగా నరికిన ఆమె మృతదేహాన్ని మెహ్రౌలీ అడవిలోని వివిధ ప్రదేశాలలో పాతిపెట్టాడు. అయితే నవంబర్ 13న ఓ వ్యక్తి తన కోడలు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో నవంబర్ 15వ తేదీన ఆ గ్రామానికి సమీపంలోని అడవిలో ఓ మహిళ దుస్తులు కనిపించాయని పోలీసులకు సమాచారం అందింది.

తండ్రి ప్రేమ... కూతురి కోసం రూ.లక్షల జీతం వచ్చే ఉద్యోగం వదిలేసి...!

విచారణలో భాగంగా ఆ దుస్తులు తప్పిపోయిన సరస్వతికు చెందినవని పోలీసులు గుర్తించారు. అదే అడవిలో గాలింపు చేపట్టగా ఓ చోట పాతిపెట్టిన తల కనిపించింది. ఆ ప్రదేశానికి కొంచెం దూరంలో ఒక మొండెం కూడా కనిపించింది. నర్సింగపూర్ లోని కరేలీ ప్రాంతంలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

మాజీ ప్రేమికుడి అరాచకత్వం.. వివాహమైన యువతిని హత్య చేసి, మృతదేహాన్ని 8 ముక్కలుగా నరికి.. తల వేరు చేసి..

ఈ ఘటనపై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) కుమార్ ప్రతీక్ మాట్లాడుతూ.. “ నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. తన భార్య తీరుపై అనుమానం వచ్చి ఆమెను అడవికి తీసుకెళ్లి గొడ్డలితో నరికి చంపాడు. ఈ విషయాన్ని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఆ తర్వాత తల, మొండెం వేరువేరుగా పాతిపెట్టాడు. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.’’ అని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios