ఎలక్టోరల్ బాండ్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్.. వచ్చే నెల 6న విచారణ
ఎలక్టోరల్ బాండ్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు వచ్చే నెల 6వ తేదీన విచారించనుంది. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనున్నట్టు సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది.
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కాంగ్రెస్ నేత పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. డిసెంబర్ 6వ తేదీన ఈ పిటిషన్ విచారించనుంది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ జేబీ పర్దివాలాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు మంగళవారం వెల్లడించింది.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న సంవత్సరంలో ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలును మరో 15 రోజులపాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ కాంగ్రెస్ లీడర్ జయ ఠాకూర్ పిటిషన్ వేశారు. దీనితోపాటు 2018 ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ వ్యాలిడిటీని సవాల్ చేస్తూ ఇతర పిటిషన్లూ దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు అన్నింటినీ సుప్రీంకోర్టు విచారించనుంది.
Also Read: హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు.. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు రూ.545 కోట్ల విరాళాలు
రాజకీయ విరాళాల్లో మరింత పారదర్శకత తేవడానికి క్యాష్కు బదులు ఎలక్టోరల్ బాండ్లను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 2018 జనవరి 2న కేంద్ర ప్రభుత్వం ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ను నోటిఫై చేసింది.