Asianet News TeluguAsianet News Telugu

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను కోరిన సోనియా: మోడీకి లేఖ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  సోనియాగాంధీ  ఇవాళ లేఖ రాశారు.

Sonia Gandhi to seek details on Parliament special session agenda in letter to Modi lns
Author
First Published Sep 6, 2023, 12:39 PM IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ  ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి  బుధవారంనాడు లేఖ రాశారు.ఈ నెల  18వ తేదీ నుండి నిర్వహించే  పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సంబంధించిన ఎజెండా  ఇవ్వాలని ఆమె ఆ లేఖలో కోరారు.పార్లమెంట్ సమావేశాల ఎజెండాలో తొమ్మిది అంశాలను చేర్చాలని  సోనియా గాంధీ డిమాండ్ చేశారు.అదానీ, మణిపూర్ అంశం, రైతు సమస్యలను ఎజెండాలో చేర్చాలని  సోనియా గాంధీ కోరారు. కనీస మద్దతు ధర, కులాల వారీగా జనగణనను ఎజెండాను చేర్చాలని ఆమె కోరారు.

ఈ నెల  18 నుండి  22వ తేదీ వరకు  పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఈ సమావేశాల్లో ఏ రకమైన వ్యూహంతో  ముందుకు వెళ్లాలనే దానిపై  కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు చర్చించారు. పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు సంబంధించిన ఎజెండాను వెల్లడించాలని సోనియా గాంధీ ఆ లేఖలో కోరారు.  ఎజెండా ప్రకటించకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడంపై  కేంద్రం తీరుపై  విపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు సంబంధించి కూడ  ఏ పార్టీతో కూడ  కేంద్రం సంప్రదింపులు జరపలేదని  కాంగ్రెస్ చీఫ్  మల్లికార్జున ఖర్గే  సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల  ఎజెండాను బహిర్గతపర్చకపోవడం  వాస్తవ సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చడమేనని  ఖర్గే పేర్కొన్నారు.

also read:పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. సోనియా నివాసంలో కీలక భేటీ

ఒకే దేశం, ఒకే ఎలక్షన్ కు సంబంధించిన  బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లో  కేంద్రం ప్రవేశ పెట్టే అవకాశం ఉందనే  ప్రచారం సాగుతుంది. అయితే  ఈ విషయమై  మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కూడ  కమిటీని  కేంద్రం  ఇటీవల ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.ఈ నెల  18నుండి  22 వరకు  పార్లమెంట్ కొత్త భవనంలో  పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ విషయమై  ఇటీవల కేంద్ర పార్లమెంట్  వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ట్వీట్ చేశారు. ఈ సమావేశాల ఎజెండాను త్వరలోనే చెబుతామన్నారు. అయితే ఇప్పటివరకు ఎజెండా  ప్రకటించకపోవడంపై  విపక్ష పార్టీలు కేంద్రంపై  విమర్శలు గుప్పిస్తున్నాయి.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios