Asianet News TeluguAsianet News Telugu

వలసవాద చట్టమైతే ఏంటీ? రాజద్రోహ చట్టం అవసరం.. శిక్ష మరింత కఠినంగా ఉండాలి: కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ రిపోర్ట్

వలసవాద చట్టమైతే ఏమిటీ.. రాజద్రోహం నేటి భారత దేశానికి అవసరం అని లా కమిషన్ పేర్కొంది. అంతేకాదు, రాజద్రోహ చట్టం కింద శిక్ష మరింత కఠినతరం చేయాలని సూచించింది. రాజద్రోహ చట్టం కింద కేసులు నమోదు చేయరాదని సుప్రీంకోర్టు గతేడాది ఆదేశించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని సమీక్షించాలని లా కమిషన్‌ను అడిగిన సంగతి తెలిసిందే.
 

sedition law is needed in our country, should made punishment tougher says law commission kms
Author
First Published Jun 2, 2023, 2:05 PM IST

న్యూఢిల్లీ: రాజద్రోహ చట్టం కేవలం వలసవాద కాలం నాటి చట్టమైనందుకు తొలగించాల్సిన అవసరం లేదని లా కమిషన్ పేర్కొంది. కేవలం వలస వాద చట్టం అని తొలగించడమంటే.. ప్రస్తుతం భారత దేశంలో నెలకొని ఉన్న వాస్తవ పరిస్థితులను చూడనిరాకరించినట్టే అవుతుందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితులకు మన దేశంలో రాజద్రోహ చట్టం అవసరమే అని స్పష్టం చేసింది. అంతేకాదు, ఆ చట్టం మరింత కఠినతరంగా ఉండాలని సూచించింది. రాజద్రోహ చట్టం కింద శిక్షను మూడు సంవత్సరాలను పెంచాలని, కనీసం ఏడేళ్ల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష వేయాలని తెలిపింది.

రాజద్రోహ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు గతేడాది ఈ చట్టం కింద క్రిమినల్ ట్రయల్స్, కోర్టు ప్రొసీడింగ్స్‌ను నిలిపేసింది. అదే సందర్భంలో ఈ నిర్ణయాన్ని సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని సమీక్షించాలని లా కమిషన్‌ను అడిగింది.

లా కమిషన్ తన రిపోర్టులో పై వివరాలు పేర్కొంది. రాజద్రోహ చట్టాన్ని తొలగిస్తే దేశ భద్రత, సమగ్రతకు ముప్పు ఏర్పడుతుందని, విద్రోహ శక్తులు వాటి ఎజెండాను మరింత విస్తృతం చేస్తాయని హెచ్చరించింది. జాతి ద్రోహ, వేర్పాటువాద శక్తులు హింసాత్మక, చట్ట విరుద్ధ మార్గాల్లో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వాన్ని కాపాడటానికి ఐపీసీలోని సెక్షన్ 124ఏ కాపాడుతుందని వివరించింది.

Also Read: రెజ్లర్లకు నక్సలైట్ల మద్దతు, బ్రిజ్ భూషణ్‌ను వెంటనే అరెస్టు చేయాలి: ఛత్తీస్‌గడ్‌లో బ్యానర్

దుర్వినియోగం గురించి పేర్కొంటూ.. కేసు నమోదు చేయడానికి ముందు కొన్ని సేఫ్‌గార్డులు చేర్చాలని ఆ రిపోర్టు పేర్కొంది. ఎస్ఐ ర్యాంకు, ఆ పై ర్యాంకు పోలీసు అధికారులు ప్రాథమిక దర్యాప్తు జరిపిన తర్వాతే కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కేసు నమోదు చేయాలని సూచనలు చేసింది. 

రాజద్రోహ చట్టం కేవలం వలసవాద కాలానిదనే కారణం ఆ చట్టాన్ని కూలదోయడానికి సరిపోదని వివరించింది. అలా ఆలోచిస్తే మన దేశంలోని మొత్తం లీగల్ సిస్టమ్ ఫ్రేమ్ వర్క్ అంతా అప్పటిదే అని వాదించింది. ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ వంటివీ బ్రిటీష్ కాలపు అవశేషాలనే చెప్పాలి.

రాజద్రోహానికి బదులు ఉపా, ఎన్ఎస్ఏ చట్టాలను ఉపయోగించవచ్చుననే వాదనలూ సరికావని పేర్కొంది. 124ఏ కవర్ చేసిన అంశాలన్నింటినీ ఆ చట్టాలు కవర్ చేయలేవని తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios