కొడుకుతో కలిసి సచిన్ టెండూల్కర్ జాలీ ట్రిప్.. ఖరీదైన కార్లను వదిలి కియా కేరెన్స్ లో ప్రయాణం.. వీడియో వైరల్
సచిన్ టెండుల్కర్ తన ఫ్యామిలీతో కలిసి ఓ జాలీ ట్రిప్ కు వెళ్లారు. దీనికి సంబంధించి ఆయన ఓ వీడియో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అది ఇప్పుడు వైరల్ గా మారింది.
క్రికెట్ అభిమానులు దేవుడుగా కొలిచే సచిన్ టెండూల్కర్కు కార్లంటే ఎంతో ఇష్టం. ఆయన దగ్గర అనేక దేశాలకు చెందిన కార్లు ఉన్నాయి. అయితే ఇటీవల సచిన్ టెండూల్కర్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. చాలా కారణాల వల్ల ఈ వీడియో ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. సచిన్ టెండుల్కర్ తన వద్ద ఉన్న ఖరీదైన కార్లను వదిలేసి, సింపుల్ గా ఉండే వినయపూర్వకమైన కియా కేరెన్స్ ఎంపీవీలో రోడ్డు ట్రిప్ కు వెళ్లాడు. ఆయన ఈ వాహనాన్ని ఎంచుకోవడానికి అనేక కారణాలే ఉన్నాయి.
ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ట్విట్టర్.. ఇండియా మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ టీమ్ సిబ్బందిలో భారీగా కోత
ఈ వీడియోలో సచిన్ టెండుల్కర్ రోడ్డు పక్కన కారును ఆపారు. దగ్గరలో ఉన్న టీ కొట్టుకు వెళ్లి ఛాయ్ తీసుకున్నాడు. అక్కడే ఉండే రస్క్ తింటూ దానిని ఆస్వాదించాడు. ఆ సమయంలో ఆయన పిల్గావ్-గోవా ఎక్స్ప్రెస్వేలో ఉన్నానని చెప్పారు. ఈ ఎక్స్ప్రెస్వేను ముంబై నుండి గోవాకు వెళ్లే వాహనదారులు ఉపయోగిస్తుంటారు.
భారత్ జోడో యాత్ర ... రాహుల్ గాంధీపై కేసు, కేజీఎఫ్ 2 వల్లే
సచిన్ తన కుటుంబంతో కలిసి రిలాక్సింగ్ రోడ్ ట్రిప్లో ఉన్నారు. అయితే ఆయన తన ప్రయాణం కోసం ఆచరణాత్మక ఎంపీవీ కియో కేరెన్స్ ను ఎంచుకున్నారు. సచిన్ టెండుల్కర్ ఈ కారునే ఎందుకు ఉపయోగించుకున్నారో అర్థం చేసుకోవడమేమీ కష్టం కాదు. ఈ సిరీస్ కారులో కుటుంబ సభ్యుల తమ ట్రిప్ లో సామాను పెట్టుకోవడానికి విశాలమైన స్థలాన్ని కలిగి ఉంటుంది. అలాగే తాజా ఫీచర్లు ఈ కారులో అందుబాటులో ఉన్నాయి.
కియా కేరెన్స్తో పాటు, సచిన్ టెండూల్కర్ వద్ద అనేక దేశాల కార్ల కలెక్షన్స్ ఉన్నాయి. ఆయన కలెక్షన్ లోని కార్లలో పోర్షే కయెన్, బీఎండబ్ల్యూ ఐ8, నిస్సాన్ జీటీఆర్, ఫెరారీ 360 మోడెనా, మెర్సిడెస్-ఏఎంజీ సీ36, బీఎండబ్ల్యూ ఎక్స్ 5 ఎంతో పాటు ఇతర కార్లు కూడా ఉన్నాయి. అయితే ఈ మాస్టర్ బ్లాస్టర్ తనకు మొట్టమొదటి సారి బహుమతిగా వచ్చిన మారుతి 800 కారే తనకు అత్యంత ఇష్టమైనదని పలుమార్లు చెప్పారు.