సీడీఎస్ జనరల్​ బిపిన్​ రావత్​ (bipin rawat) బావమరిది యశ్ వర్ధన్​ సింగ్​ (yash vardhan singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుమతి లేకుండా మధ్యప్రదేశ్​ ప్రభుత్వం తన భూమిని స్వాధీనం చేసుకుందని మండిపడ్డారు.

సీడీఎస్ జనరల్​ బిపిన్​ రావత్​ (bipin rawat) బావమరిది యశ్ వర్ధన్​ సింగ్​ (yash vardhan singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుమతి లేకుండా మధ్యప్రదేశ్​ ప్రభుత్వం తన భూమిని స్వాధీనం చేసుకుందని మండిపడ్డారు. జాతీయ రహదారి పనుల కోసం తన సొంత భూమిని వినియోగిస్తున్నట్లు ఫేస్​బుక్​లో ఓ పోస్ట్​ పెట్టారు. రావత్​ మరణించిన వారం రోజులకే ఆయన బావమరిది ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశంలో చర్చనీయాంశమైంది. తన బావ బిపిన్​ రావత్, సోదరి మధులికా రావత్ అంత్యక్రియల రోజు ఈ విషయాన్ని తాను గుర్తించినట్లు యశ్ వర్ధన్​ సింగ్ తెలిపారు. దీనికి సంబంధించి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఎలాంటి నష్టపరిహారమూ అందించలేదని ఆయన ఆరోపించారు. 

దేశానికి సేవచేసేందుకు ముందుంటామని, కానీ అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా ఈ విధానాన్ని ఎలా అనుసరిస్తారు? అని యశ్ వర్ధన్​ సింగ్ ప్రశ్నించారు. బిపిన్ రావత్ సతీమణి మధులిక స్వస్థలమైన మధ్యప్రదేశ్​లోని షహడోల్‌ జిల్లా రాజాబాఘ్ సోహగ్​పుర్​లో జాతీయ రహదారికి ఆనుకొని సింగ్‌ కొంత భూమి ఉంది. ప్రస్తుతం అక్కడే జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నట్లు యశ్ వర్ధన్​ సింగ్ పేర్కొన్నారు.

ALso REad:Sulur Helicopter crash: కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి

కాగా.. ఈ వ్యవహారం షహడోల్‌ జిల్లా కలెక్టర్​ వందనా వైద్య వరకు చేరింది. దీనిపై విచారణ జరిపిస్తానని, తహశీల్దార్​ సహా ఇతర అధికారులను సంఘటనా స్థలానికి పంపి విచారణ చేయిస్తామని కలెక్టర్ వెల్లడించారు. అటు ఈ అంశంపై రాష్ట్ర హోం మంత్రి (madhya pradesh home minister) నరోత్తమ్​ మిశ్రా (narottam mishra) కూడా ట్వీట్​ చేశారు. ఎస్పీ నుంచి పూర్తి వివరాలు కోరిన ఆయన.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలిస్తే కఠినంగా శిక్షిస్తామని హోంమంత్రి హెచ్చరించారు.