విపక్ష సభ్యుల గందరగోళం మధ్యే రాజ్య సభలో వ్యవసాయబిల్లుకు ఆమోదం తెలిపింది. విపక్షపార్టీల సభ్యులు పోడియం వద్దే నిలబడి ఆందోళనకు దిగారు.  

న్యూఢిల్లీ:విపక్ష సభ్యుల గందరగోళం మధ్యే రాజ్య సభలో వ్యవసాయబిల్లుకు ఆమోదం తెలిపింది. విపక్షపార్టీల సభ్యులు పోడియం వద్దే నిలబడి ఆందోళనకు దిగారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

వాయిస్ ఓటు ద్వారా రాజ్యసభలో వ్యవసాయ బిల్లులకు రాజ్యసభలో ఆమోదం లభించింది. ఈ బిల్లులను వైసీపీ, బీజేడీలు మినహా ఇతర విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆకాలీదళ్, ఆప్, టీఆర్ఎస్ సభ్యులు పోడియం వద్ద నిలబడి ఆందోళనకు దిగారు. 

also read:వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో గందరగోళం: బిల్లు పత్రుల చించివేత

అంతకుముందు విపక్ష సభ్యులు ఈ బిల్లు ప్రతును చింపి విసిరేశారు. డిప్యూటీ ఛైర్మెన్ మైక్ ను లాగేందుకు ప్రయత్నించారు.ఈ బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 

విపక్షాల నిరసనల మధ్యే వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను అకాలీదళ్ తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్ర మంత్రివర్గం నుండి అకాలీదళ్ వైదొలిగింది.

మూడు వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఇవాళ ఆమోదం తెలిపింది. రాజ్యసభ సభలో ఏ కూటమికి చెందని పార్టీల మద్దతును అధికార బీజేపీ కూడగట్టింది. రాజ్యసభలో బీజేపీకి 105 మంది సభ్యులున్నారు. 25 మంది ఎంపీలు ఎన్డీఏ, యూపీఏకి చెందిన కూటమిలో లేని పార్టీలకు చెందిన సుమారు 25 మంది మద్దతును బీజేపీ కూడగట్టింది.

ఈ బిల్లులపై ఓటింగ్ జరిగితే ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తెరవెనుక ప్రయత్నాలు చేసింది. అయితే వాయిస్ ఓటింగ్ ద్వారానే ఈ బిల్లును రాజ్యసభలో పాస్ చేయించుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది.