జపాన్ రక్షణ శాఖ మంత్రితో యసుకాజు హమదాతో రాజ్ నాథ్ సింగ్ సమావేశం.. ద్వైపాక్షిక వ్యూహాత్మక అంశాలపై చర్చ
బుధవారం నుంచి జపాన్ లో పర్యటిస్తున్న భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు ఆ దేశ రక్షణ శాఖ మంత్రితో సమావేశం అయ్యారు. రెండు దేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలను చర్చించారు.
భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జపాన్ రక్షణ శాఖ మంత్రి యసుకాజు హమదాను గురువారం కలిశారు. అనంతరం ఆయనతో సమావేశం అయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ప్రత్యేక వ్యూహాత్మక అంశాలపై చర్చ జరిగింది. ‘‘ ఈ రోజు టోక్యోలో జపాన్ రక్షణ మంత్రి మిస్టర్ యసుకాజు హమదాతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ద్వైపాక్షిక రక్షణ, ప్రాంతీయ వ్యవహారాలకు సంబంధించిన వివిధ అంశాలను సమీక్షించాం. ఈ సంవత్సరం రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తవుతాయి ’’ అని రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.
తెలంగాణ గ్రానైట్తో నేతాజీ విగ్రహం.. నేడు ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ
‘‘ భారత్, జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని అనుసరిస్తాయి. జపాన్తో భారత రక్షణ భాగస్వామ్యం ఉచిత, బహిరంగ, నిబంధనల ఆధారిత ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ’’ అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.
5 రోజుల విదేశీ పర్యటనలో ఉన్న రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు జపాన్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన జపాన్ ఆత్మరక్షణ సిబ్బందికి నివాళులర్పించారు.
కాగా.. ఆయా ప్రాంతాల్లో చైనా సైనిక విన్యాసాలు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశం, యుఎస్, అనేక ఇతర ప్రపంచ శక్తులు స్వేచ్ఛా, బహిరంగ, అభివృద్ధి చెందుతున్న ఇండో-పసిఫిక్ను నిర్ధారించాల్సిన అవసరం గురించి మాట్లాడుతున్నాయి. తైవాన్, ఫిలిప్పీన్స్, బ్రూనై, మలేషియా, వియత్నాంతో పాటు దక్షిన చైనా సముద్రాన్ని కూడా చైనానే క్లైమ్ చేస్తోంది. బీజింగ్ దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ ద్వీపాలు, సైనిక స్థావరాలను నిర్మించింది.
రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం నుంచి జపాన్లో అధికారికంగా ప్రారంభమైంది. వారు నేడు జపాన్ దేశాల ప్రతినిధులతో ఇద్దరూ చర్చలు జరుపుతారు. ఇది భారత్, జపాన్ మధ్య జరిగే రెండో 2+2 మంత్రుల సంభాషణ. బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనలో ఇద్దరు మంత్రులు జపాన్ మంత్రులతో వ్యూహాత్మక చర్చలు జరుపుతారు. ఈ సమాచారాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
రాజ్నాథ్ సింగ్ జపాన్ విదేశాంగ మంత్రి యసుకాజు హమాదాతో భేటీ కానుండగా, జైశంకర్ జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషితో భేటీ కానున్నారు. భారత రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి సెప్టెంబర్ 10 వరకు జపాన్లో ఉంటారు. భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా భారత్ను సందర్శించిన ఐదు నెలల తర్వాత ఈ సంభాషణ జరగనుంది.