Asianet News TeluguAsianet News Telugu

డ్రింక్ తాగించి మహిళపై రైల్వే ఇంజనీర్ల గ్యాంగ్ రేప్

ఓ మహిళపై భోపాల్ డివిజన్ లోని ఇద్దరు రైల్వే ఇంజనీర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాంతో వారిద్దరు సస్పెన్షన్ కు గురయ్యారు .సంఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది.

Railway engineers suspended allegdly molested woman KPR
Author
Bhopal, First Published Sep 28, 2020, 6:44 AM IST

భోపాల్: ఒడిశాలో చోటు చేసుకున్న దారుణమైన సంఘటనలో అధికారులు కదిలారు. ఓ మహిళపై సామూహిక అత్యాచారం పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దజీంతో ఇద్దరు రైల్వే ఇంజనీర్లను సస్పెండ్ చేశారు. 

జూనియర్ ఇంజనీర్ రాజేశ్ తివారీ, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అలోక్ మాలవీయాలు డబ్ల్యూసీఆర్ భోపాల్ డివిజన్ లో ఉద్యోగులు. రాజేశ్ కు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళతో ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి అతడు ఆమెను భోపాల్ కు రావాలని చెప్పాడు. 

దాంతో ఆమె శనివారం ఉదయం భోపాల్ కు వచ్చింది. రాజేశ్ ఆమెను భోపాల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గదిలో ఉంచాడు. ఆ తర్వాత మాలవీయతో కలిసి ఆమెకు డ్రింక్ తాగించాడు. ఆ తర్వాత వారిద్దరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. 

దానిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఘటనపై భోపాల్ డివిజనల్ రైల్వే మేనేజర్ శాఖాపరమైన విచారణ చేపట్టారు. నిందితులను సస్పెండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios