మాంసం తీసుకురాలేదని గొడవ.. భార్య గొంతు కోసి, చంపిన భర్త, అరెస్ట్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో మాంసం విషయంలో జరిగిన గొడవ కారణంగా ఓ వ్యక్తి తన భార్యను గొంతు కోసి హత్య చేశాడు.
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లో హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోని అలీగఢ్ జిల్లాలో మాంసం తీసుకువచ్చే విషయంలో జరిగిన గొడవ కారణంగా ఓ వ్యక్తి తన భార్యను గొంతు కోసి హత్య చేశాడు. రోరావర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మబుద్నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ఉత్తరప్రదేశ్ సగీర్ అనే నిందితుడు భార్య గుడ్డో(30), ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉండేవాడు. మాంసం తీసుకురావడం విషయంలో సోమవారం సగీర్ భార్యతో గొడవ పడ్డాడు. గొడవ తీవ్రరూపం దాల్చడంతో ఆవేశానికి లోనైన సాగిర్ తన పిల్లల ముందే కత్తితో భార్య గొంతు కోశాడు. చిన్నారుల అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.
మృతురాలి కుమార్తె సంఘటన మొత్తాన్ని ప్రత్యక్షంగా చూసింది. మాంసం విషయంలో తల్లిదండ్రుల మధ్య గొడవ జరిగిందని, ఆ తర్వాత ఆమె తండ్రి తన తల్లి గొంతు కోసాడు అని చుట్టుపక్కలవారికి చెప్పింది. దీంతో వారు సగీర్ను పారిపోకుండా.. పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.అక్కడికి చేరుకున్న పోలీసులకు నిందితుడిని అప్పగించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. నిందితుడిని అరెస్టు చేశామని, నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని అలీగఢ్ సిటీ ఎస్పీ కుల్దీప్ గుణవత్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు. దీనిమీద తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ లో కిచిడీ తిని 21 మందికి అస్వస్థత...
ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ లో ఓ పదేళ్ల చిన్నారి నరబలి ఘటన కలకలం రేపింది. క్షుద్రపూజలు చేసే మాంత్రికుడి సలహా మేరకు ఓ వ్యక్తి తమ బంధువు కుమారుడైన 10 ఏళ్ల బాలుడిని చంపాడు. ఈ ఘటనలో పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆదివారం తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని పర్సా గ్రామ నివాసి కృష్ణ వర్మ కుమారుడు వివేక్ గురువారం రాత్రి కనిపించకుండా పోయాడని పోలీసు సూపరింటెండెంట్ ప్రశాంత్ వర్మ తెలిపారు. అదే రోజు రాత్రి పొలంలో గొంతు కోసిన చిన్నారి మృతదేహం లభ్యమైందని తెలిపారు.
కోల్కతాలో మైనర్ బాలిక కిడ్నాప్, హత్య.. మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కిన పక్కింటి వ్యక్తి...
విచారణలో, చనిపోయిన పిల్లాడి బంధువు అనూప్కు రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడని, అతను మానసిక వికలాంగుడు, అనారోగ్యంతో ఉన్నాడని పోలీసులు కనుగొన్నారు. అతనికి ఎన్ని చికిత్సలు చేయించినా.. సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో అనూప్ తన గ్రామానికి సమీపంలోని ఓ క్షుద్ర వైద్యుడిని సంప్రదించాడని పోలీసులు తెలిపారు. అతని విషయాలన్నీ కనుక్కున్న మాంత్రికుడు అనూప్ను నరబలి ఇచ్చేందుకు ప్రేరేపించాడని, ఆ తర్వాత వివేక్ మామ చింతారామ్తో కలిసి చిన్నారిని కిడ్నాప్ చేసి, పారతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.ముగ్గురు నిందితులు - అనూప్, చింతారామ్, క్షుద్ర పూజలు చేస్తున్న మాంత్రికుడిని శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ఆదివారం తెలిపారు.