యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, ఒడిశా యూట్యూబర్ ప్రియాంకా సేనాపతితో సంబంధాలున్నట్లు ఆరోపణల నేపథ్యంలో విచారణ జరుగుతున్నట్లు ఎస్పీ తెలిపారు. 

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, ఒడిశా యూట్యూబర్ ప్రియాంకా సేనాపతితో సంబంధాలున్నట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతోందని పూరీ ఎస్పీ వినీత్ అగర్వాల్ తెలిపారు. హర్యానాలోని హిసార్‌కు చెందిన జ్యోతి మల్హోత్ర గూఢచర్యానికి పాల్పడినందుకు పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ అధికారితో సంబంధాలు పెట్టుకుని, భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని అతనికి చేరవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై హర్యానా పోలీసులతో టచ్‌లో ఉన్నామని పోలీసు అధికారి తెలిపారు. 

జ్యోతికి..ప్రియాంకకి సంబంధం ఏంటి
 

ఎస్పీ వినీత్ అగర్వాల్, "ఈ సంఘటన గురించి సమాచారం అందిన తర్వాత, మేము విచారణ చేపట్టాము. విచారణ పూర్తయిన తర్వాత, అన్ని వాస్తవాలను వెల్లడిస్తాం. దీంతో పాటు, వివిధ రాష్ట్రాల ఏజెన్సీలు, కేంద్ర ఏజెన్సీ, హర్యానా పోలీసులతో మేము టచ్‌లో ఉన్నాము, వారికి అవసరమైన సమాచారాన్ని అందిస్తాం." యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, ఒడిశా యూట్యూబర్ ప్రియాంకా సేనాపతి మధ్య ఉన్న సంబంధం గురించి అడిగినప్పుడు, పూరీ ఎస్పీ వినీత్ అగర్వాల్, "మేము ప్రతిదీ ధృవీకరించి మీకు తెలియజేస్తాము" అని అన్నారు. 
 

రెండుసార్లు పాకిస్తాన్‌కు వెళ్లి

జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ కి  సమాచారాన్ని అందించినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపారు. ఆమె ఢిల్లీలో పాకిస్తాన్ అధికారి అహ్సాన్-ఉర్-రహీమ్‌ను కలిసి, రెండుసార్లు పాకిస్తాన్‌కు వెళ్లి, రహస్య సమాచారాన్ని పంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో, 2023లో వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌కు వెళ్లి అహ్సాన్-ఉర్-రహీమ్ అనే వ్యక్తిని కలిసినట్లు ఆమె పోలీసులకు తెలిపింది. 
 

బ్యాంకు డాక్యుమెంట్లు, ఫోన్, ల్యాప్‌టాప్

నంబర్లు మార్చుకున్న తర్వాత, అహ్సాన్-ఉర్-రహీమ్‌తో మాట్లాడటం ప్రారంభించి, రెండుసార్లు పాకిస్తాన్‌కు వెళ్లినట్లు యూట్యూబర్ పోలీసులకు తెలిపింది. అహ్సాన్-ఉర్-రహీమ్ ఆమె బస, ప్రయాణ ఏర్పాట్లు చేసి, పాకిస్తాన్ భద్రతా, నిఘా సంస్థలతో సమావేశాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 
గూఢచర్యం ఆరోపణలపై హర్యానా పోలీసులు అరెస్టు చేసిన జ్యోతి తండ్రి హరిస్ మల్హోత్రా మాట్లాడుతూ, తన కుమార్తె యూట్యూబ్ వీడియోలు చేసి పాకిస్తాన్‌కు వెళ్లిందని, పోలీసులు తీసుకున్న ఫోన్‌లను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం పోలీసులు మొదట తమ ఇంటికి వచ్చారని ఆయన చెప్పారు. పోలీసులు తమ బ్యాంకు డాక్యుమెంట్లు, ఫోన్, ల్యాప్‌టాప్, పాస్‌పోర్ట్ తీసుకున్నారని ఆయన చెప్పారు. తన కుమార్తె ఢిల్లీకి వెళ్లేదని, గత నాలుగు-ఐదు రోజులుగా హిసార్‌లో ఉందని ఆయన చెప్పారు.