Asianet News TeluguAsianet News Telugu

పుల్వామా దాడి: ఆన్ లైన్ లో పేలుడు పదార్థాలా?

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్ఫీఎఫ్) కాన్వాయ్‌పై జరిగిన దాడిలో  పేలుడు పదార్థాలను ఆన్‌లైన్‌లో ఆ మారణ హోమం సృష్టించిన ఉగ్రవాది కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. 

Pulwama attack investigation: chemicals brought on amazon to make bombs
Author
Srinagar, First Published Mar 7, 2020, 12:28 PM IST

న్యూఢిల్లీ: గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పుల్వామా దాడి విషయంలో  మరో నిజం వెలుగులోకి వచ్చింది.  సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్ఫీఎఫ్) కాన్వాయ్‌పై జరిగిన దాడిలో  పేలుడు పదార్థాలను ఆన్‌లైన్‌లో ఆ మారణ హోమం సృష్టించిన ఉగ్రవాది కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. 

ఈ మేరకు  కొనుగోలు చేసిన ఇద్దరు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్‌కు చెందిన వైజ్-ఉల్-ఇస్లాం (19), పుల్వామాకు చెందిన మహ్మద్ అబ్బాస్ రాథర్ (32)లను అదుపులోకి  తీసుకున్నారు. 

పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైష్-ఎ-మొహమ్మద్ (జెఎమ్) ఆదేశాల మేరకు బ్యాటరీలు, బాంబుల తయారీకి  ఉపయోగపడే ఇతర రసాయనాలను నిందితుడు ఇస్లాం తన అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్ ఖాతా  ద్వారా  కొనుగోలు చేసి, అనంతరం  ఉగ్రవాద సంస్థకు పంపిణీ చేసినట్టు  తెలిపారు.  

Also read: పూల్వామా దాడికి ఏడాది: భారత్ ఏం చేసింది?

మరోనిందితుడు రాథర్ 2018 ఏప్రిల్ నుంచి మే మధ్యకాలంలో జైషే ఉగ్రవాది , ఐఈడీ బాంబుల తయారీ నిపుణుడు మొహద్ ఉమర్ తో పాటు ఇతర ఉగ్రవాదులైన ఆదిల్ అహ్మద్ దార్, సమీర్ అహ్మద్ దార్, కమ్రాన్ లకు తన ఇంట్లో  ఆశ్రయమిచ్చాడని పోలీసులు వెల్లడించారు.

నిందితులను శనివారం జమ్మూలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు హాజరుపరుస్తామని, ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. దాడిలో అమ్మోనియం నైట్రేట్, నైట్రో-గ్లిజరిన్ ఆర్డీఎక్స్ వంటి రసాయనాలను ఉపయోగించినట్టు  ఫోరెన్సిక్ నిఫుణులు వెల్లడించారు. 

పుల్వామా ఉగ్ర దాడిలో దాదాపు 40 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లు ప్రాణుల కోల్పోయిన విషయం తెలిసిందే. 

ఈ ఘటనతో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి.  ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటనకు ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని  ప్రజలు అభిప్రాయపడ్డారు.

Also read: పుల్వామా దాడి: టెర్రరిస్టులకు సహకరించిన తండ్రీకూతుళ్ల అరెస్టు

అన్ని రాజకీయ పార్టీలు కూడ ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటన తర్వాత ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించిన ప్రధాని తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు.

ఐక్యరాజ్యసమితితో పాటు ప్రపంచంలోని పలు దేశాలు ఈ దాడులను ఖండించాయి. టెర్రరిజానికి వ్యతిరేకంగా జరిగే పోరుకు తమ మద్దతును ప్రకటించాయి.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఈ దాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్ కు ఎప్పుడూ స్నేహా హస్తం అందించే చైనా కూడ భారత్‌కు అండగా నిలిచింది. ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios