ప్రాజెక్ట్ చిరుత ను ప్రారంభించింది యూపీఏ ప్రభుత్వమే - కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్
భారత్ లోకి చిరుతను తిరిగి ప్రవేశపెట్టిన ఘనత తమదే అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకుంటున్నారని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ అన్నారు. కానీ తమ ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు చిరుతను ప్రారంభించామని చెప్పారు.
భారత్ లో ప్రాజెక్ట్ చిరుతను ప్రవేశపెట్టింది యూపీఏ ప్రభుత్వమే అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ అన్నారు. అయితే దేశంలో దశబ్దాల తరువాత చిరుతలను తిరిగి ప్రవేశపెట్టిన ఘనతను ప్రధాని నరేంద్ర మోదీకి దక్కించుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఈ మేరకు ఆయన 2009 సంవత్సరంలో కేంద్ర పర్యావరణ, ఆటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వైల్డ్లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (WTI) కు చెందిన ఎంకే రంజిత్ కు చిరుతల పునరుద్ధరణ రోడ్మ్యాప్ను సిద్ధం చేయాలని తను ఆమోదం తెలుపుతూ రాసిన లేఖను ఆదివారం ట్వీట్ చేశారు.
1952లో అంతరించిపోయినప్పటి నుండి భారతదేశంలో చిరుతలను తిరిగి ప్రవేశపెట్టడానికి గత ప్రభుత్వాలు నిర్మాణాత్మక ప్రయత్నాలు చేయలేదని ప్రధాని చేసిన ఆరోపణలకు సమాధానంగా రమేష్ ఈ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీని ఆయన ‘పాథలాజికల్ అబద్దాలకోరు’ అని అభివర్ణించారు. 2009లో చీతా ప్రాజెక్టును ప్రారంభించిన లేఖ ఇది అని ఆయన పేర్కొన్నారు. ‘‘ 2009 సెప్టెంబర్ 28, అక్టోబరు 6వ తేదీల్లో మీరు రాసిన లేఖ నాకు అందింది. దయచేసి మీరు ముందుకు సాగండి. చిరుతను తిరిగి ప్రవేశపెట్టడానికి వివరణాత్మక రోడ్మ్యాప్ను సిద్ధం చేయండి ’’ అని లేఖలో కనిపిస్తోంది.
‘‘ మన ప్రధాని ఒక అబద్ధాల కోరు. భారత్ జోడో యాత్రపై నా మక్కువ కారణంగా నేను నిన్న ఈ లేఖపై చేయి వేయలేకపోయాను’’ అని రమేష్ ట్వీట్ చేశారు. చిరుతను తిరిగి ప్రవేశపెట్టడంపై తాను రాసిన కొత్త కథనాల క్లిప్పింగ్ను ఆయన అంతకు ముందు రోజు షేర్ చేశారు. “ తన సొంత ప్రమాణాల ప్రకారం కూడా జూత్లోని జగత్గురు ఈ రోజు కొత్త అత్యల్ప స్థాయిని తాకారు. దశాబ్దాలుగా చిరుతలకు ఏమీ చేయలేదన్న ఆయన వాదన పచ్చి అబద్ధం. ఈ వ్యాసంలో నేను సంవత్సరాలుగా చేసిన ప్రయత్నాలను డాక్యుమెంట్ చేసాను ” అని ఆయన పేర్కొన్నారు.
జార్ఖండ్లో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు.. సీఆర్పీఎఫ్ జవాన్ కు గాయాలు..
మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో ఉన్న కునో నేషనల్ పార్క్ (కేఎన్పీ)లోని ప్రత్యేక ఎన్క్లోజర్లలో నమీబియా నుంచి దిగుమతి చేసుకున్న ఎనిమిది చిరుతల్లో మూడింటిని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే జైరాం రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆర్టీఓ ఆఫీస్కు వెళ్లకుండా.. ఇంట్లో కూర్చొనే.. ఆన్లైన్లో 58 ఆర్టీఓ సేవలు
‘‘ఈరోజు ప్రధానమంత్రి నిర్వహించే తమాషా అనవసరమైనది. ఇది జాతీయ సమస్యలను, భారత్ జోడో యాత్రను ప్రజల చూపును మళ్లించేందుకు మరో విక్షేపం ’’ అని జైరాం రమేష్ శనివారం ట్వీట్ చేశారు. అన్నారు. 2009-11లో మొదటిసారిగా పులులను పన్నా, సరిస్కా ప్రాంతాలకు తరలించినప్పుడు వినాశనాన్ని చాలా మంది ఊహించారని, అవి తప్పని రుజువయ్యాయని రమేష్ అన్నారు. “చిరుత ప్రాజెక్ట్పై కూడా ఇలాంటి అంచనాలే ఉన్నాయి. ఇందులో పాల్గొన్న నిపుణులు అసాధారణంగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నారు. దీని కోసం పని చేస్తున్న అందరికీ శుభాకాంక్షలు ’’ అని తెలిపారు.