ఎనిమిదో గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రధాని మోడీ.. అభివృద్ది ప్రణాళికను సిద్దం చేయాలంటూ ఆదేశాలు
New Delhi: సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన (ఎస్ఏజీవై) కింద అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలోని కుర్హువా గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు జిల్లా చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ బుధవారం తెలిపారు. ప్రధాని మోడీ మొత్తం 8 గ్రామాలను దత్తతకు తీసుకున్నారు.
PM Modi adopts eighth village: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎనిమిది గ్రామాలను దత్తత తీసుకున్నారు. సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన (SAGY) కింద అభివృద్ధి కోసం వారణాసిలోని కుర్హువా గ్రామాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దత్తత తీసుకున్నారని జిల్లా ముఖ్య అభివృద్ధి అధికారి బుధవారం తెలిపారు. వారణాసి పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్ఏజీవై కింద నియోజకవర్గంలో ఆయన దత్తత తీసుకున్న ఎనిమిదో గ్రామం కుర్హువా అని సంబంధిత అధికార వర్గాలు పేర్కొన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కుర్హువా గ్రామం పేరును ప్రధాని స్వయంగా ప్రతిపాదించారని చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ హిమాన్షు నాగ్పాల్ తెలిపారు. గ్రామంలో అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసేందుకు అధికారుల బృందం మకాం వేసిందన్నారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డిఆర్డిఎ) పోర్టల్లో వీలైనంత త్వరగా ప్లాన్ను అప్లోడ్ చేయాలని ఆదేశించినట్లు అధికారులు చెప్పారు. కుర్హువా గ్రామ చీఫ్ రమేష్ సింగ్ ప్రధాని చర్యను స్వాగతించారు. “మా కల నిజమైంది. ప్రస్తుతం గ్రామం అధ్వాన స్థితిలో ఉంది. తాగునీరు, రోడ్లు, పాఠశాలలు, ఆరోగ్య సౌకర్యాలు లేవు.. మరేదైనా ప్రాథమిక సౌకర్యాల లభ్యత ఏదైనా ఇక్కడ నివసించడం కష్టానికి తక్కువ కాదు. మేము ఇప్పుడు లోతైన మెరుగైన మార్పును ఆశిస్తున్నాము”అని ఆయన చెప్పారు.
కాగా, లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా అక్టోబర్ 11, 2014న ప్రధాని మోడీ, సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన (SAGY) ని ప్రారంభించారు. ఎస్ఏజీవై వెబ్సైట్ వివరాల ప్రకారం.. గుర్తించబడిన గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధికి దారితీసే ప్రక్రియలను ప్రేరేపించడం ఈ పథకం లక్ష్యంగా ఉంది. ఈ సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన (SAGY) కింద, ప్రధాని గతంలో జయపూర్, నాగేపూర్, కక్రహియా, డోమ్రి, పరమాపూర్, ప్యూర్ బరియార్, ప్యూర్ గావ్లను దత్తత తీసుకున్నారు. జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుర్హువా గ్రామం ఉంది.