ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తుల విషయమై  14 విపక్ష పార్టీలు దాఖలు  చేసిన పిటిషన్ ను  సుప్రీంకోర్టు తిరస్కరించింది. 

న్యూఢిల్లీ: సీబీఐ, ఈడీ దర్యాప్తులపై 14 విపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు బుధవారంనాడు తిరస్కరించింది. రాజకీయ ప్రత్యర్ధులపై సీబీఐ, ఈడీ , ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఉపయోగిస్తుందని విపక్షాలు ఆరోపించాయి. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలొని 14 పార్టీలు ఈ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు బుధవారంనాడు నిరాకరించింది. అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ ను స్వీకరించేందుకు నిరాకరించడంతో విపక్షాలు పిటిషన్ ను ఉపసంహరించుకున్నాయి. 

also read:ఈడీ, సీబీఐ దర్యాప్తులు: సుప్రీంకోర్టులో 14 విపక్ష పార్టీల పిటిషన్

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రఛూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని కాంగ్రెస్ నేతృత్వంలోని 14 పార్టీలు ఆ పిటిషన్ లో ఆరోపణలు చేశాయి. సీబీఐ, ఈడీ దాఖలు చేసిన కేసుల్లో ఎక్కువగా విపక్ష పార్టీలకు చెందిన నేతలపైనే ఉన్నాయని విపక్షాలు ఆ పిటిషన్ లో పేర్కొన్నాయి. 

తాను భవిష్యత్తు కోసం మార్గర్శకాలను అడుగుతున్నానని విపక్ష పార్టీల తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టును కోరారు. 2014కు ముందు ఆ తర్వాత ఈడీ, సీబీఐ కేసుల్లో భారీ పెరుగుదల ఉందని సింఘ్వి చెప్పారు. బెయిల్ మార్గదర్శకాలను అడుగుతున్నానన్నారు.