Asianet News TeluguAsianet News Telugu

PM Modi| అంతా ఓకే.. కానీ, ఆ విషయంపై మాట్లాడకండి: మంత్రులకు ప్రధాని మోదీ సలహా

PM Modi| ప్రధాని నరేంద్ర మోదీ మంత్రులతో సమావేశమయ్యారు. ఇందులో ఎన్డీయే మంత్రులకు రెండు సలహాలు ఇచ్చారు. సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన ప్రకటనకు సరైన సమాధానం ఇవ్వాలని, ఇండియా వర్సెస్ ఇండియా వివాదంలో మాట్లాడవద్దని మంత్రులను ప్రధాని కోరారు.

PM Modi Message To Ministers On Bharat India Political Row KRJ
Author
First Published Sep 6, 2023, 11:46 PM IST

PM Modi| ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ మంత్రులకు రెండు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన ప్రకటనపై సరైన (వాస్తవాలతో) స్పందించాలని ప్రధాని మోదీ NDA మంత్రులను కోరారు. దీనితో పాటు.. ఇండియా వర్సెస్  భారత్  వివాదంలో ప్రకటనలు చేయవద్దని ప్రధాని మోడీ మంత్రులను కోరారు. దీనితో పాటు.. జి-20 సమావేశానికి సంబంధించి మంత్రులందరూ హాజరు కావాలని ప్రధాని మోడీ కోరారు.

అంతే కాదు.. తమ విధి విదేశీ దేశాధినేతలు, ప్రతినిధులతో ఉందని, వారికి ఈ దేశ సంస్కృతి, జీవనశైలి,  ఆహారపు అలవాట్లకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ముందుగానే తెలియజేయాలని మంత్రులకు చెప్పారు. సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన ప్రకటనను పెద్ద సమస్యగా మార్చే ఆలోచనలో బీజేపీ ఉందని ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన్‌ను డెంగ్యూతో పోల్చిన సంగతి తెలిసిందే.

విందు విషయంలో మంత్రులకు ప్రధాని సలహా

విందుకు ఆహ్వానించిన ముఖ్యమంత్రి కూడా తన అనుచరగణంతో పార్లమెంటు భవన సముదాయానికి చేరుకుని అక్కడి నుంచి బస్సుల్లో వెళ్తారు. విందు కోసం మంత్రులు, ముఖ్యమంత్రి సాయంత్రం 5:50 గంటలకు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌కు చేరుకుని 6:30 గంటలకు సభా వేదిక వద్దకు చేరుకోవాలి.

జీ-20 సదస్సు 

భారతదేశ అధ్యక్షతన సెప్టెంబర్ 9 నుండి 10 వరకు ఢిల్లీలో G-20 సమ్మిట్ నిర్వహించబడుతుంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలువురు దేశాధినేతలు ఇందులో పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 9న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము G-20 విందును ఏర్పాటు చేయనున్నారు.

 ఉదయనిధి ఏం చెప్పారు?

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ 'సనాతన్‌ను వ్యతిరేకించడమే కాదు, దానిని రద్దు చేయాలని సూచించారు. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి, సమానత్వానికి విరుద్ధమని ఆరోపించారు. అదే సమయంలో సనాతన ధర్మాన్ని  డెంగ్యూ,మలేరియా, కరోనాతో పోల్చారు.  ఆ వ్యాధి కారక జీవులను ఎలా తొలగిస్తామో సనాతన ధర్మాన్ని కూడా అలానే తొలగించాలని పేర్కొన్నారు.  

ఈ ప్రకటనపై బీజేపీతో పాటు మత గురువులు కూడా ఉదయనిధిపై మండిపడ్డారు.  ఉదయనిధి I.N.D.I.A సాకుతో ప్రతిపక్ష పార్టీల కూటమి అయితే ప్రశ్నలు కూడా తలెత్తాయి. స్టాలిన్ పార్టీ డిఎంకె కూడా I.N.D.I.A.(ఇండియా) కూటమిలో భాగం. మతానికి వ్యతిరేకంగా ఇలాంటి ప్రకటనలు చేయరాదని బీజేపీ, మత పెద్దలు విరుచుకపడ్డారు. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఉదయనిధి ప్రకటనకు దూరంగా నిలిచాయి. అదే సమయంలో ఉదయనిధి మాత్రం తన ప్రకటనను సమర్థించుకుంటూ.. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ మళ్లీ చేస్తానని అన్నారు.  

భారత్ వర్సెస్ ఇండియాపై రచ్చ 

సనాతన ధర్మానికి సంబంధించిన గందరగోళం జరగుతుండగా.. మరోవైపు..భారత్ వర్సెస్ ఇండియా అనే చర్చ కూడా సాగుతోంది. వాస్తవానికి G-20 సమావేశానికి రాష్ట్రపతి భవన్ ఆహ్వాన లేఖలను జారీ చేసింది. సెప్టెంబర్ 9న రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న కార్యక్రమం కోసం జారీ చేసిన ఆహ్వానంలో ప్రెసిండెంట్ ఆఫ్ ఇండియా బదులుగా ప్రెసిండెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించబడింది. దీంతో గందరగోళం ప్రారంభమైంది. 

బీజేపీ ప్రభుత్వం I.N.D.I.A.( ఇండియా) కూటమికి భయపడిందనీ, దేశ అధికారిక పేరును ఇండియా నుండి భారత్‌గా మార్చాలనుకుంటోందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే వచ్చేవారం జరగనున్న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశంలో ఇండియా‌ పేరును భారత్‌గా మార్చే ప్రతిపాదన తీసుకరానున్నదనే వాదన కూడా ప్రచారం జరుగుతోంది. అలాంటి ప్రతిపాదన ఏమైనా పార్లమెంటుకు వస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.  

మరో విషయం తెరపైకి వచ్చింది. దేశం పేరుకు బదులు భారత్ అని రాయడం మోడీ ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిందని వెల్లడించారు. నిజానికి ప్రధాని మోదీ గత నెలలో దక్షిణాఫ్రికా,గ్రీస్‌లో పర్యటించినప్పుడు.. ఆ సమయంలో ఆయన ఫంక్షన్ నోట్స్‌పై భారత ప్రధాని అని కూడా రాశారు. అయితే ఇప్పుడు దీనిపై దృష్టి సారించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios