Asianet News TeluguAsianet News Telugu

ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ.. ప్ర‌ధాని మోడీపై మ‌రో మ‌నీహిస్ట్ పోస్ట‌ర్‌తో విమ‌ర్శ‌లు

PM Modi Hyderabad Visit: మ‌నీహిస్ట్ పోస్టుల‌తో బీజేపీ, ప్ర‌ధాని మోడీపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. "మేము బ్యాంకుల‌ను దోచుకుంటే.. మీరు ఏకంగా దేశాన్ని దోచుకుంటున్నారు... ప్ర‌జా ప్ర‌భుత్వాలను ప‌డ‌గొట్టి అధికారం దాహం తీర్చుకుంటున్నారు.." అంటూ మ‌నీహిస్ట్ పోస్ట‌ర్ల‌తో  విమ‌ర్శ‌లు  వెల్లువెత్తుతున్నాయి.
 

PM Modi Hyderabad Visit: Another Money Heist poster targets BJP, PM Modi
Author
Hyderabad, First Published Jul 3, 2022, 9:51 AM IST

PM Modi Hyderabad Visit:  తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఒక‌రిపై ఒక‌రు చేస్తున్న విమ‌ర్శ‌లు పొలిటిక‌ల్ హీట్‌ను పెంచుతున్నాయి. ఇక భార‌తీయ జ‌న‌తా పార్టీ( బీజేపీ), తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్‌) ల మ‌ధ్య వార్ ప‌తాక స్థాయికి చేరుకుంది. హైద‌రాబాద్ న‌గ‌రంలో భార‌తీయ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశం ఏర్పాటు చేయ‌డంతో పాటు ప్ర‌ధాని మోడీ స‌హా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, సీనియ‌ర్ నాయ‌కులు, అగ్ర‌నేత‌లంద‌రూ కూడా తెలంగాణ‌లో అడుగుపెట్ట‌డంతోనే రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై  విమ‌ర్శ‌లు గుప్పించ‌డం రాజ‌కీయంగా వైరాన్ని మ‌రింత‌గా ముదిరేలా చేసింది. 

అయితే, తెలంగాణ ప్ర‌భుత్వంపై ఇదివ‌ర‌కు ప‌లువురు బీజేపీ నేత‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం, అలాగే, కేంద్ర నుంచి తెలంగాణ‌కు న్యాయంగా రావాల్సిన నిధుల్లో కొత‌లు పెట్ట‌డంపై టీఆర్ఎస్ తో పాటు ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక వ‌స్తోంది. అలాగే, కేంద్ర ప్ర‌భుత్వం కావాల‌నే వివ‌క్ష చూపుతున్న‌ద‌ని రాష్ట్ర పార్టీలు, ప‌లు వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే బీజేపీ, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని టార్గెట్ చేస్తున్న స‌రికొత్త స్టైల్ లో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఘాటు వ్యాఖ్య‌ల‌తో నెటిజ‌న్లు చేస్తున్న ఆరోప‌ణ‌లు అంద‌రినీ ఆలోచ‌న‌లు ప‌డేస్తున్నాయి. త‌గ్గెదే లే అంటూ మ‌నీహిస్ట్ స్టైల్ లో బీజేపీ, ప్ర‌ధాని మోడీ పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న పోస్ట‌ర్లు హైద‌రాబాద్ వెలిశాయి. రోజుకో స‌రికొత్త విమ‌ర్శ‌లు, ఘాటు వ్యాఖ్య‌ల‌తో మ‌నీహిస్ట్ మ‌స్క‌ట్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. 

బీజేపీ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు, ప్ర‌ధాని మోడీ రాక నేప‌థ్యంలో శ‌నివారం నాడు హైద‌రాబాద్ న‌గరంలో మేము బ్యాంకుల‌ను మాత్ర‌మే దోచుకుంటాము.. కానీ మీరు యావ‌త్ దేశాన్ని దోచుకుంటున్నారు బై బై మోడీ అంటూ పోస్ట‌ర్లు వెలిశాయి. అలాగే, కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లు, కార్యాల‌యాల ముందు మ‌నీహిస్ట్ మ‌స్క‌ట్లతో మోడీ, బీజేపీని టార్గెట్ చేస్తూ ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. ఇవీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో పాటు బైబై మోడీ ట్రెండింగ్ లో కొన‌సాగింది. 

ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో మ‌నీహిస్ట్ పోస్ట‌ర్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇందులో బీజేపీ, ప్ర‌ధాని మోడీపై ఘాటుగానే విమ‌ర్శ‌లు గ‌ప్పించారు. ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ కూల్చివేస్తోందని పోస్టర్‌లో ఆరోపించారు. అధికార పార్టీల ఎమ్మెల్యేలు తమ విధేయుడిని మార్చిన తర్వాత కాషాయ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన రాష్ట్రాల పేర్లను ఈ మ‌నీహిస్ట్ పోస్ట‌ర్ల‌లో పేర్కొన్నారు. అలాగే, బైబై మోడీ అంటూ రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో కూడా బైబై మోడీ ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. 

కాగా, నేడు ప్రధాని నరేంద్ర మోడీ పరేడ్ గ్రౌండ్స్ జరిగే బీజేపీ విజయ్ సంకల్ప్ బహిరంగ సభలో మాట్లాడనున్నారు. 

Read more:

బీజేపీ జాతీయ కార్యవర్గసమావేశాలు: నేడు తెలంగాణపై కీలక ప్రకటన చేసే చాన్స్

Maharashtra Speaker Poll : నేడే మ‌హారాష్ట్ర అసెంబ్లీ స్పీక‌ర్ ఎన్నిక‌.. పోటీలో ఇద్ద‌రు నేత‌లు

 

Follow Us:
Download App:
  • android
  • ios