Asianet News TeluguAsianet News Telugu

నిన్న మేకలదొంగల చేతుల్లో ఎస్ఐ, నేడు వాహనంతో ఢీకొట్టి ఎంవీఐ హత్య.. చెన్నైలో వరుస దారుణాలు..

కరూర్ రీజనల్ ట్రాన్స్ పోర్ట్ కార్యాలయంలో ఇన్ స్పెక్టర్ గా కనకరాజు పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం కరూర్ బైపాస్ రోడ్డులోని పుత్తాం పుదుర్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఓ వాహనం ఆయన్ని ఢీ కొట్టి వెళ్లి పోయింది. మొదట దీనిని అందరూ ప్రమాదంగానే భావించారు. 

MVI killed as vehicle he tried to stop hits him in chennai, Rs 50 lakh ex-gratia announced by CM
Author
Hyderabad, First Published Nov 23, 2021, 10:44 AM IST

చెన్నై : మేకల దొంగల చేతుల్లో ఎస్ఐ హత్యకు గురైన ఘటన మరువక ముందే తమిళనాడులో అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. తనిఖీల్లో ఉన్న Motor Vehicle Inspector (ఎంవీఐ)ను వాహనంతో ఢీ కొట్టి హతమార్చిన ఘటన కరూర్ లో సోమవారం ఉదయం జరిగింది. సీసీ కెమెరాల ఆధారంగా వాహనాన్ని గుర్తంచిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

కరూర్ రీజనల్ ట్రాన్స్ పోర్ట్ కార్యాలయంలో ఇన్ స్పెక్టర్ గాKanakaraj పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం కరూర్ బైపాస్ రోడ్డులోని పుత్తాం పుదుర్ వద్ద Inspection of vehiclesలు చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఓ వాహనం ఆయన్ని ఢీ కొట్టి వెళ్లి పోయింది. మొదట దీనిని Accidentగా భావించారు. 

గాయపడ్డ ఆయన్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స తీసుకుంటూ మరణించారు. రంగంలోకి దిగిన కరూర్ పోలీసులు సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా విచారణ చేశారు. ఓ వ్యాన్ మహిళలను ఎక్కించుకుని అతి వేగంగా వెళ్లడాన్ని గుర్తించారు. ఎలాంటి అనుమతులు పొందకుండా ఓ Textile companyకు చెందిన వ్యాన్ అధిక లోడింగ్ తో వెళ్తూ, ఆపేందుకు యత్నించిన కనకరాజ్ ను ఢీ కొట్టి వెళ్లినట్టు తేలింది. 

వ్యాన్ ను పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న Driver కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనను సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా పరిగణించారు. నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించారు. 

ఇదిలా ఉండగా, చెన్నై, తిరుచ్చిలో Goat thieves వీరంగం సృష్టించారు. తమ సహచరులను ఛేజ్ చేసి.. పట్టుకునేందుకు వచ్చిన Special SIను దారుణంగా హతమార్చారు. ఈ దాడితో నిజాయితీ పరుడైన ఓ పోలీస్ ఆఫీసర్ ను డిపార్ట్ మెంట్ కోల్పోయింది. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ జిల్లా పోలీసులు దుండగుల కోసం జల్లెడ పడుతున్నారు. కాగా ఈ ఘటన వివరాలు విన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుడి కుటుంబానికి సీఎం స్టాలిన్ రూ. కోటి Ex Gracia ప్రకటించారు. 

మేకల దొంగల ఘాతుకం.. ఛేజింగ్ చేశాడని స్పెషల్ ఎస్సై హత్య..!

తిరుచ్చి జిల్లా తిరువేంబూరు సమీపంలోని నవల్ పట్టు పోలీస్ స్టేషన్ లో ఎస్ఎస్ఐగా భూమినాథన్ (51) పనిచేస్తున్నారు. భార్య కవిత (46), కుమారుడు గుహనాథన్ (22) ఉన్నారు. విధి నిర్వహణలో నిజాయితీపరుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. తన జీతంలో సగం అనాథాశ్రమాలయు కేటాయించేవారు. శనివారం రాత్రి హెడ్ కానిస్టేబుల్ చిత్రై వేల్ తో కలిసి గస్తీలో ఉన్నారు. 

Bhuminathan  చిన్న సూర్యర్ గ్రామ శివారులో గస్తీలో ఉండగా మేకల అరుపులను గుర్తించారు. రెండు మోటార్ సైకిళ్లపై నలుగురు యువకులు మేకలు దొంగిలించి తీసుకువెళుతుండడాన్ని గమనించారు. అంతే వెంటనే వానికి Chasing చేశారు. కొంత దూరం వెళ్లిన తరువాత ఆ దొంగలను చిత్రై వేల్ ఛేజింగ్ చేయలేకపోయారు. 

ఎస్ఐని చంపిన మేకల దొంగలు.. 24 గంటల్లో నిందితులు అదుపులోకి..

భూమినాథన్ వెనకడుగు వేయకుండా తిరుచ్చి జిల్లా నుంచి పుదుకోటై జిల్లాలోకి ప్రవేశించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత స్టేషన్ ఎస్ ఐ కీరనూర్ శేఖర్ కు కాల్ చేసి పుదుకోటై పల్లత్తు పట్టి గ్రామ శివారుకు రావాలని కోరారు. అయితే తమ వాళ్లు భూమినాథన్ కు చిక్కడంతో మిగిలిన ఇద్దరు రెచ్చిపోయారు. కత్తులతో భూమినాథన్ పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ Attackతో భూమినాథన్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కీరనూరు నుంచి శేఖర్ తో పాటు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios