నియంత్రణ రేఖ వెంబడి బారాముల్లా నుండి భుజ్ వరకు 26 ప్రాంతాలపై పాకిస్తాన్ దాడులు జరిగాయి.ఈ నేపథ్యంలో మోడీ అజిత్ ధోవల్ తో కీలక సమావేశమయ్యారు. 

ఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో, భారత్ ప్రతిదాడులు వంటి అంశాలపై చర్చించారు. సైనిక చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

రెండో రోజూ పాకిస్తాన్ దాడులు కొనసాగాయి. బారాముల్లా నుండి భుజ్ వరకు 26 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులతో ప్రారంభమైన దాడులు తెల్లవారుజాము వరకు కొనసాగాయి. ఫిరోజ్‌పూర్‌లో జరిగిన డ్రోన్ దాడిలో ముగ్గురు గాయపడ్డారు. దాడుల నేపథ్యంలో జమ్మూలో బ్లాక్‌అవుట్ ప్రకటించారు.

జమ్మూ, సాంబాలో డ్రోన్ దాడులు జరిగాయి. భారతదేశంలోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వచ్చిన పాక్ డ్రోన్‌లను భారత్ కూల్చివేసింది. పంజాబ్‌లోని అమృత్‌సర్, పఠాన్‌కోట్‌లలో కూడా దాడులు జరిగాయి. ఫిరోజ్‌పూర్‌లో జరిగిన దాడిలో ఒక కుటుంబంలోని ముగ్గురు గాయపడ్డారు. కాశ్మీర్ లోయలో కూడా డ్రోన్ దాడులు జరిగాయి.

భారత్ పాక్ దాడులను తిప్పికొట్టింది. భారత్ తన సరిహద్దులను రక్షించుకుంటోందని, దాడులను తిప్పికొడుతోందని సైన్యం వెల్లడించింది. ఉధంపూర్, పఠాన్‌కోట్, ఆదమ్‌కోట్ వంటి సైనిక స్థావరాలపై, జనావాసాలపై జరిగిన దాడులను భారత్ తిప్పికొట్టింది. పాకిస్తాన్ దాడులు చేస్తున్న సమయంలోనే లాహోర్ నుండి విమానాలు బయలుదేరాయి. లాహోర్ నుండి బయలుదేరిన పౌర విమానాలను కవచంగా ఉపయోగించుకుని పాకిస్తాన్ ఈ దాడులు చేసింది.