సీఎం పాల్గొనబోతున్న కార్యక్రమ వేదికకు నిప్పు పెట్టిన మూక.. మణిపూర్లో ఘటన
మణిపూర్లో సీఎం పాల్గొనబోయే కార్యక్రమ వేదికను ఓ మూక ధ్వంసం చేసింది. చురచాంద్పూర్లో వేదికను, దాని ఎదుట వేసిన వందలాది కుర్చీలకు నిప్పు పెట్టింది. అలాగే, రేపు సీఎం ప్రారంభించబోతున్న ఓపెన్ జిమ్కూ నిప్పు పెట్టి పాక్షికంగా ధ్వంసం చేసింది.
![mob torched cm to be attended program venue in manipur kms mob torched cm to be attended program venue in manipur kms](https://static-ai.asianetnews.com/images/01gyf6qe9m9kkabfwgbkvmmrha/fire_363x203xt.jpg)
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో ఓ మూక సీఎం ఎన్ బీరెన్ సింగ్ శుక్రవారం పాల్గొనబోయే కార్యక్రమ వేదికకు నిప్పు పెట్టింది. గురువారం రాత్రి చురచాంద్పూర్ జిల్లాలోని న్యూ లంకాలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం ఆ వేదిక పై సీఎం ఎన్ బీరెన్ సింగ్ ఆసీనులు కావాల్సి ఉంది. కానీ, గురువారం రాత్రే దానికి నిప్పు పెట్టారు. అలాగే, అక్కడే సీఎం బీరెన్ సింగ్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న ఓపెన్ జిమ్నూ ఆ మూక పాక్షికంగా ధ్వంసం చేసింది.
లోకల్ పోలీసులు వెంటనే కార్యరంగంలోకి దూకారు. ఆ మూకను చెదరగొట్టారు. కానీ, ఆ వేదికతోపాటు వందలాది కుర్చీలు ధ్వంసం అయ్యాయి.
సీఎం బీరెన్ సింగ్ పాల్గొనబోయే వేదికతోపాటు అక్కడే ఓపెన్ జిమ్ ఏర్పాట్లకూ నిప్పు పెట్టారు. న్యూ లంకాలోని పీటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ ఓపెన్ జిమ్ను శుక్రవారం సీఎం బీరెన్ సింగ్ ప్రారంభించాల్సింది. కానీ, ఆ ఓపెన్ జిమ్ను మూక నిప్పు పెట్టి పాక్షికంగా ధ్వంసం చేసింది. ఈ జిమ్ ఓపెనింగ్తోపాటు స్థానిక సద్బావన మండప్ నిర్వహించే ఓ పంక్షన్కూ సీఎం రేపు వెళ్లాల్సిన షెడ్యూల్ ఉన్నది.
Also Read: భార్యను ముక్కలుగా నరికి నిప్పు పెట్టాడు.. ఆ ల్యాండ్ లీజుకు తీసుకున్న వ్యక్తి ఫిర్యాదు తో కేసు నమోదు
ఓ ఇండిజీనస్ ట్రైబ్ లీడర్స్ ఫోరమ్ చురచాంద్పూర్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యం లోనే ఓ మూక ఈ ఘటనకు పాల్పడింది. రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా నుంచి రైతులను, ఇతర గిరిజనులను బయటకు పంపే కార్యక్రమాన్ని నిరసిస్తూ తాము ప్రభుత్వా నికి ఎన్నో మెమోరాండంలు అందిం చామని ఆ ఫోరమ్ చెప్పింది. కానీ, ప్రభుత్వం మాత్రం అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆలకించడానికీ అయిష్టత చూపె ట్టిందని వివరించింది. అందుకే సీఎం పర్యటన నేపథ్యంలో చురచాంద్పూర్ బంద్కు పిలుపు ఇచ్చింది.