భార్యను ముక్కలుగా నరికి నిప్పు పెట్టాడు.. ఆ ల్యాండ్ లీజుకు తీసుకున్న వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు
హర్యానాలోని మనేసర్లో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హతమార్చాడు. ముక్కలుగా నరికి వేరే చోటికి తీసుకెళ్లి అక్కడే నిప్పు పెట్టాడు. పొగలు రావడంతో స్థానికులు అప్రమత్తం అయ్యారు. పోలీసులు స్పాట్కు చేరి మర్డర్ కేసు పెట్టి ఆమె భర్తను అరెస్టు చేశారు.
![haryana man kills wife, chops body, sets fire kms haryana man kills wife, chops body, sets fire kms](https://static-ai.asianetnews.com/images/01gaqn2nypxqg4b4hvcmk91by3/police-gd7d0ce75e-1280-jpg_363x203xt.jpg)
న్యూఢిల్లీ: హర్యానాలో మనేసర్లో నివసిస్తున్న 34 ఏళ్ల వ్యక్తి తన భార్యను దారుణంగా హతమార్చాడు. భార్యను ముక్కలుగా నరికేశాడు. మరో చోట ఆమె దేహానికి నిప్పంటించాడు. ఆమె దేహం సగం కాలిపోయింది. అప్పుడే అక్కడి నుంచి పొగలు వస్తున్నాయనే సందేహంతో స్థానికులు చూడగా ఖంగుతిన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, గాంధీనగర్ నివాసి జితేందర్ తన భార్యతో మనేసర్ ఏరియాలో నివసిస్తున్నాడు. తన భార్యను చంపేసి చేతులు, తల నరికి వేరే చోట వేశాడు. ఆ బాడీని మరో చోటికి తీసుకెళ్లి నిప్పు పెట్టాడు.
కుక్డోలా గ్రామానికి చెందిన ఉమేద్ సింగ్ పంచగావ్ నుంచి కసన్ గ్రామానికి వెళ్లే రోడ్డ పక్కనే ఉన్న ఎనిమిది ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నాడు. ఆ భూమిలోనే రెండు గదుల నిర్మాణం జరుగుతున్నది. ఆ గదుల్లో ఆమె బాడీకి జితేందర్ నిప్పంటించాడు. ఆ గదుల్లో నుంచి పొగ వస్తున్నదని స్థానికులు ఉమేద్ సింగ్కు ఏప్రిల్ 21వ తేదీన తెలుపగా ఆయన అక్కడికి వెళ్లి చూశాడు. ఆ గదిలో సగం కాలిన దేహం చూడగానే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Also Read: రెండో ప్రపంచయుద్ధంలో ఇండియాలో పాతిపెట్టిన బాంబులు.. ఇప్పటికీ ప్రాణాలు తీస్తున్నాయి
ఆ బాడీ 30 ఏళ్ల మహిళకు చెందినదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆమె రెండు చేతులను ఆదివారం .. ఆమె తల బుధవారం సాయంత్రం ఖేర్కి దౌలా ఏరియాలో లభించాయి.
పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. నిందితుడు తన భార్యను తానే చంపేసినట్టు ఒప్పుకున్నట్టు పోలీసు వర్గాలు వివరించాయి.