Asianet News TeluguAsianet News Telugu

ఆడుకుందామని పిలిచి.. ఐదేళ్ల చిన్నారిపై లైంగికదాడికి ఒడిగట్టిన మైనర్లు..

ఐదేళ్ల చిన్నారిని ఆడుకుందామని మేడపైకి పిలిచి ముగ్గురు మైనర్ బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 

Minors sexually assaulted a five-year-old girl after calling her to play.
Author
First Published Dec 21, 2022, 11:49 AM IST

ఆ చిన్నారి తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం వలస వచ్చారు. తల్లిదండ్రులు పనికి వెళ్తే ఆ పాప ఇంటి దగ్గరే ఆడుకుంటూ ఉండేది. అయితే ఈ క్రమంలో చుట్టుపక్కల ఉండే ఇతర పిల్లలో ఆ పాపకు పరిచయం అయ్యింది. దీంతో వారితో ఆ చిన్నారి చనువుగా ఉండేది. వారితో కలిసి ఆడుకునేది. అయితే ఈ క్రమంలో సోమవారం కూడా వారితో ఆడుకుందామని వెళ్లిన చిన్నారికి చేదు అనుభవం ఎదురైంది. అభంశుభం తెలియని ఆ బాలికపై ఆ బాలురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. లైంగిక దాడికి ఒడిగట్టారు. ఈ ఘటన సైదాబాద్ పోలీసు స్టేషన్ లో చోటు చేసుకుంది.

తాగొచ్చి వేధిస్తున్నాడని... భర్తను నరికి చంపిన భార్య...!

వివరాలు ఇలా ఉన్నాయి. బతుకుదెరువు కోసం ఓ కుటుంబం సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని పూసలబస్తీకి వచ్చి ఉంటోంది. నిత్యం పని చేసుకుంటూ వచ్చిన డబ్బులుతో ఆ కుటుంబం నివసిస్తోంది. ఆ కుటుంబంలో ఐదేళ్ల పాప ఉంది. తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో ఇంటి దగ్గరే ఆడుకుంటూ ఉండేది. అయితే తన కంటే కొంచెం పెద్ద వయస్సున్న పిల్లలతో కూడా బాలిక అప్పుడప్పుడు ఆడుకుంటూ ఉండేది.

వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవికి చేదు అనుభవం... గడపగడపకు కార్యక్రమంలో నిలదీత

ఈ క్రమంలో సోమవారం చిన్నారి తల్లిదండ్రులు పనికి వెళ్లారు. దీంతో బాలిక ఇంటి వద్ద ఒంటరిగా ఉంది. ఇదే సమయంలో ఓ ఇంటిపైన ముగ్గురు బాలురు గాలిపటాలు ఎగురవేస్తున్నారు. ఆ చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటోంది. ఆ పాప ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఈ బాలురు.. పైన ఆడుకుందామని పిలిచారు. వారి మాటలు నమ్మిన బాలిక పైకి వెళ్లింది. దీంతో అక్కడున్న ముగ్గురు బాలురు ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్న నూతన సచివాలయం... మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలన

అయితే ఈ ముగ్గురు బాలుర ప్రవర్తన విచిత్రంగా, కొత్తగా కనిపించడంతో స్థానికంగా నివసించే ఓ మహిళకు అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని చిన్నారి తల్లికి తెలియజేసింది. వారిద్దరూ కలిసి ఆ పాప దగ్గరకు వెళ్లి ఏం జరిగిందని ఆరా తీశారు. దీంతో తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక వారికి చెప్పింది. దీంతో ఆ పాప తల్లిందండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తమ బిడ్డపై జరిగిన దారుణాన్ని వివరించి ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురు మైనర్లపై పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిలో ఒకరి వయస్సు 16 సంవత్సరాలు, మరొకరి వయస్సు 11 సంవత్సరాలు, ఇంకొకరి వయస్సు 9 ఏళ్లు ఉంటాయని తెలిసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios