Asianet News TeluguAsianet News Telugu

మంగళూరు, కోయంబత్తూరు పేలుళ్లు.. కేరళతో సంబంధాలు వెలుగులోకి.. !

మంగళూరు, కోయంబత్తూరు ఉగ్ర పేలుళ్ల ప్రధాన నిందితులకు కేరళతో సంబంధాలు ఉన్నాయన్న విషయం బయటపడింది. రెండు కేసుల్లో ప్రధాన నిందితులు సెప్టెంబర్‌లో ఒకే సమయంలో కేరళకు వెళ్లారు.

Mangaluru and Coimbatore terror blasts main accused connection emerges between  Kerala
Author
First Published Nov 23, 2022, 1:20 PM IST

ఢిల్లీ : అక్టోబరు 23న కోయంబత్తూరులో జరిగిన ఉగ్రదాడి పేలుడుకు, శనివారం మంగళూరులో జరిగిన ఆటోరిక్షా పేలుడుకు కేరళతో సంబంధం ఉన్నట్లు తేలింది. సమచారం ప్రకారం, కోయంబత్తూర్ పేలుడు నిందితుడు, జమేషా మౌబిన్ వైద్య చికిత్స కోసం సెప్టెంబర్ రెండవ వారంలో కేరళలో ఉన్నాడు. మంగళూరు పేలుళ్ల ప్రధాన నిందితుడు షరీక్‌ అదే సమయంలో కేరళలోని అలువాకు వెళ్లాడు.

షరీక్ అలువాలోని ఒక లాడ్జిలో బస చేసి, ఇ-కామర్స్ వెబ్‌సైట్ల నుండి అక్కడి తన లాడ్జికి డెలివరీలు తెప్పించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కేరళలో వారికి ఏవైనా ఇతర సాధారణ లింకులు ఉన్నాయా లేదా ఏదైనా డబ్బుకు సంబంధించిన లింకులు ఉన్నాయా అనే దానిపై తదుపరి విచారణ నిర్వహించబడుతుంది.

కదులుతున్న ఆటోలో పేలుడు..ఇద్దరికి తీవ్ర గాయాలు.. కర్ణాటకలో ఘటన

ఇదిలా ఉండగా, ఈ పేలుళ్లకు సంబంధించి జరుగుతున్న విచారణలో అనేక ప్రశ్నలు తలెత్తుతాయని భావిస్తున్నారు. జమీషా మౌబిన్, షరీక్ ఇద్దరూ ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యాల నుండి వచ్చారు. వారి కేరళ పర్యటన ద్వారా వారికి నిధులు సమకూరే మార్గం సుగమం చేసిందా? వారు కామన్ హ్యాండ్లర్లుగా ఉన్నారా? అనేవి తేలాల్సి ఉంది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళూరు పేలుడు నిందితుడు షరీక్ అలువా రైల్వే స్టేషన్ సమీపంలోని జైతూన్ రూమ్స్ అనే లాడ్జిలో బస చేశాడు.

హోటల్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. షరీక్ సెప్టెంబర్ 13న సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో చెక్ ఇన్ చేసి సెప్టెంబర్ 18 సాయంత్రం చెక్ అవుట్ చేశాడు. ఫేక్ ఐడీ, హిందూ పేరును ఉపయోగించి రూమ్ తీసుకున్నాడు. ఈ హోటల్ సెప్టెంబరు 2న ప్రారంభమయ్యింది. హోటల్ కొత్తగా ప్రారంభించారు కాబట్టి.. కొత్తలో కొద్దిరోజులు హోటల్‌ని సందర్శించిన వ్యక్తుల గురించి సిబ్బంది పక్కాగా వివరాలు రాసుకోలేదు.

కోయంబత్తూరు కారు పేలుడు: ఐదుగురు అరెస్ట్

అతనున్న ఐదు రోజులలో, హోటల్ లో ఎవరూ అతన్ని కలవలేదు. కారణంసింగిల్ రూమ్‌లలోకి అతిథులను అనుమతించకపోవడమే అయితే, అతను ఈ-కామర్స్ వెబ్‌సైట్ల నుండి హోటల్‌కు వస్తువులను డెలివరీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసు అధికారులు హోటల్ గెస్ట్ రికార్డ్ బుక్ నుండి అతను బస వివరాలను తీసుకున్నారు. ఈ హోటల్ కేరళీయులు కానివారు, ముఖ్యంగా వలస కార్మికులతో నిండిన ప్రాంతంలో ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios