వీడి దుంపతెగ.. కట్నం కోసం భార్యను బావిలో వేలాడదీశాడు..
అదనపు కట్నం డిమాండ్ చేస్తూ మధ్యప్రదేశ్ లోని ఓ వ్యక్తి.. తన భార్యను బావిలో వేలాడదీశాడు. ఈ వీడియో వెలుగు చూడడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. అదనపు కట్నం వేధింపుల్లో కొత్త పుంతలు తొక్కాడో భర్త. భార్యను బావిలో తాడుతో వేలాడదీశాడు. దీన్నంతా వీడియో తీసి.. అదనంగా రూ.5 లక్షలు ముట్టచెప్పాలంటూ అత్తింటివారికి పంపించాడు.
మధ్యప్రదేశ్ లోని నీముచ్లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. వరకట్నం డిమాండ్తో భార్యను బావిలో వేలాడ తీసిన వ్యక్తి.. ఈ ఘటనను చిత్రీకరించిన నిందితుడు.. వీడియోను తన భార్య బంధువులకు పంపించాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
కట్నం కోసం భార్యను బావిలో అత్యంత దారుణంగా వేలాడదీసిన వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఆగస్టు 20న నీమచ్లో జరిగింది. వివరాల ప్రకారం రాకేష్ కిర్ అనే వ్యక్తి తన భార్య ఉషను బావిలోని నీళ్లలోకి తాడుతో వేల్లాడదీశాడు. ఆ తరువాత దాన్నంతా వీడియో తీశాడు.
అనంతరం ఆ వీడియోను తన భార్య బంధువులకు పంపించాడు. అది చూసి వారు షాక్ అయ్యారు. తీవ్ర భయాందోళనలతో గ్రామానికి చెందిన కొందరిని సంప్రదించి తమ కుమార్తెను రక్షించాల్సిందిగా అభ్యర్థించారు.
ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాకేష్ను అదుపులోకి తీసుకున్నారు. 3 నుంచి 5 లక్షల కట్నం డిమాండ్తో నిందితుడు అలా చేశాడని పోలీసులు తెలిపారు.